Suryaa.co.in

Features

500 సంవత్సరాల తరువాత చెప్పులు .. తలపాగాలు ధరించిన సూర్యవంశ క్షత్రీయులు!

22.01.2024న అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతోంది. ఆ రోజు మరో ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. అయోధ్య చుట్టుపక్కల 15 గ్రామాల్లో నివసిస్తున్న లక్షా 50 వేల మంది సూర్య వంశ క్షత్రీయులు 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెప్పులు, తలపాగాలు ధరించనున్నారు

ఇస్లామియ రాజు హయాంలో రామజన్మ భూమి ఆలయాన్ని కూల్చివేసినప్పుడు దానిని కాపాడేందుకు సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల క్షత్రీయవంశ సైనికులు తమ శౌర్యంతోపాటుగా ఆలయాన్ని కూల్చివేయడం పట్ల చాలా బాధపడ్డారు. మళ్లీ అదే స్థలంలో రామమందిరం నిర్మించే వరకు తలపాగాలు, చెప్పులు, గొడుగులు ధరించబోమని సూర్య వంశ క్షత్రీయులంతా ప్రతిజ్ఞ చేశారు

తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి, గత ఐదు శతాబ్దాల పాటు ఈ సూర్యవంశ క్షత్రియులు వివాహ సందర్భాలలో కూడా చెప్పులు, తలపాగా గొడుగు ధరించకుండా జీవించారు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో సూర్యవంశ క్షత్రియులకు 22న ధరించేందుకు కొత్త తలపాగా తయారు చేసి గ్రామాలవారీగా పంపిణీ చేస్తున్నారు.

– రామ్ లక్ష్మణ్

LEAVE A RESPONSE