గంగులకు అనుమతి ఇచ్చి.. కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వరు?

– ఈ నెల 9న కరీంనగర్ గడ్డపై కవాతు చేద్దాం తరలి రండి
టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా ఒక ఆంధ్రా అధికారిని నియమించారు.కరీంనగర్ లో మేం సభ పెడతామంటే అనుమతులివ్వను అంటున్నాడు. కరీంనగర్ గడ్డ మీద సభ జరగనివ్వకుంటే.. కాంగ్రెస్ శ్రేణులతో కవాతు చేస్తాం గంగులకు అనుమతి ఇచ్చి, కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వరు?తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వనని ఆంధ్రా అధికారి అంటున్నడు..తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా..ఈ నెల 9న కరీంనగర్ గడ్డపై కవాతు చేద్దాం తరలి రండి.

ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా.. లక్షల మంది బీఆరెస్ కార్యకర్తలు అడ్డు వచ్చినా కరీంనగర్ సభ జరిపి తీరతాం.ఏం జరిగినా, రక్తం చిందించయినా కరీంనగర్ గడ్డపై కవాతులో పాల్గొంటాం.భూ పల్లి లో రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసినా ఓపిక పట్టాం..మా సహనానికి పరీక్ష పెట్టొద్దు..నలుమూలల కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా..

9న సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ కు మీరు తరలిరండి.. నేనూ వస్తా..ఎవడు అడ్డుకుంటాడో.. తుపాకీ తూటాలు వదులుతారో చూసుకుందాం..అనుమతులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా..9న ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ లో సభ జరిపి తీరతాం..

Leave a Reply