Suryaa.co.in

Telangana

కాంట్రాక్టులన్నీ ఖమ్మం జిల్లా మంత్రికే!

– డిప్యూటీ సీఎం 30% కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు
కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని కొట్టే రోజులు దగ్గర్లోనే ఉంది
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు.

హైదరాబాద్: అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు.

హైదరాబాద్ లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇంట్లో ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. మొన్నటి ఖమ్మం వరదల సమయంలో అక్కడి ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారని చెప్పారు.

బర్త్ డే ఫంక్షన్ లకు పోవడానికి హెలికాప్టర్ లను ఉపయోగిస్తున్న మంత్రులు, ఖమ్మం వరదలప్పుడు మాత్రం హెలికాప్టర్ లు పంపలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనానికి ఓ కుటుంబం వదరల్లో కొట్టుకుపోయిందని కేటీఆర్ ఆరోపించారు. 2014 తర్వాత ఖమ్మంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి ని చేసింది.పువ్వాడ అజయ్ లాంటి ఉత్సాహవవంతమైన నాయకుడు ఓడిపోవడం బాధాకరం.

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బిఆర్ఎస్ కు కొంత నష్టం జరిగింది. ఓడిపోయినా కూడా ప్రజలకు కష్టం వస్తే బిఆర్ఎస్ నాయకులు గులాబీ దండు ఈ సంవత్సర కాలంగా ప్రజలకు అండగా ఉంది.ఖమ్మంలో వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చాడు.

డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదు.ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదు. ఎమ్మెల్యేల బర్త్డేలకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారు.

ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషమున్న ఎవడైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడు. కానీ కానీ రేవంత్ రెడ్డికి రేశం లేదు కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడు.మా స్కూటీ ఏమైందని కాలేజీ పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారు.కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉన్నారు.

ముఖ్యమంత్రి నియోజకవర్గం లోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇవ్వాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుంది.కాంట్రాక్టు మంత్రి, ఆయన కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని నిన్న కొడంగల్ లో చెప్పా. . డిప్యూటీ సీఎం 30% కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు.

వ్యవసాయ మంత్రి రుణమాఫీ కాలేదని చెప్తే సీఎం మాత్రం మొత్తం రుణ మాఫీ అయిందంటారు. ఇలా మంత్రులకి ముఖ్యమంత్రికి శృతి లేదు. ఫలితంగా తెలంగాణ అధోగతి పాలయింది.బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కెసిఆర్ చేపించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5% ఉంటే రేవంత్ చేసిన కులగరణ సర్వేలో ఐదున్నర శాతం తగ్గించి 46% కి బీసీ జనాభాను చూపిస్తుంది.

కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైం అయిపోయింది.మహబూబ్నగర్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న ఓ మంత్రిని తులం బంగారం లేదని మహిళలు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారు. ఈ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుంది.
త్వరలోనే ఖమ్మం వస్తాను.

LEAVE A RESPONSE