-ఎన్టీరామారావు జీవితంలోకి వచ్చి నందమూరి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు
-లక్ష్మీ పార్వతి హీన చరిత్ర గురించి కరపత్రాలు ముద్రించి ఇంటింటికి వెళ్లి పంచుతాం
-వైసీపీకి రాజీనామా చేసి ఎన్టీరామారావు హెల్త్ యూనివర్శిటీకి అదే పేరు ఉండాలని పోరాడాలి
-గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తిన జయలక్ష్మీ
ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్శిటీకి పేరుమార్చిన పదిరోజులకు లక్ష్మీపార్వతి మేల్కొని ప్రెస్ మీట్ పెట్టడం ఆమెకు ఎన్టీరామారావుపై ఎంతటి ప్రేమ ఉందో తెలుస్తోంది. వీరగంధం సుబ్బారావును లక్ష్మీ పార్వతి వెన్నుపోటు పొడిచి ఎన్టీరామారావు వద్దకు రాలేదా? టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ పంపిన మాయలేడి లక్ష్మీపార్వతి. మాయ లేడి(మాయలాడి) చేతిలో పార్టీ నాశనమవకుండా చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని పూల పాన్పుపై నడిపించారు.
ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు ముందు లక్ష్మీపార్వతిని దర్శనం చేసుకొని ఆమెకు బంగారు వడ్డాణమో, బంగారు ఉంగరాలో కానుకలు ఇస్తేగాని ఎన్టీరామారావు దర్శనమయ్యేదికాదు. ఎన్టీరామారావు జీవితంలోకి వచ్చి నందమూరి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. నందమూరి, నారావారి కుటుంబాల గురించి మాట్లాడితే తాట తీస్తామని టీడీపీ తెలుగు మహిళలందరూ హెచ్చరిస్తున్నాం. ఇలాగే అవాకులు, చవాకులు పేలుస్తుంటే లక్ష్మీ పార్వతి హీన చరిత్ర గురించి కరపత్రాలు ముద్రించి ఇంటింటికి వెళ్లి పంచుతాం.
లక్ష్మీ పార్వతి వళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పదవులపై వ్యామోహం వీడాలి. ఎన్టీరామారావుపై అభిమానమే ఉంటే వైసీపీకి రాజీనామా చేసి ఎన్టీరామారావు హెల్త్ యూనివర్శిటీకి అదే పేరు ఉండాలని పోరాడాలి. అప్పుడే ఎన్టీరామారావుపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ప్రపంచానికి తెలుగు జాతి గురించి చెప్పిన వ్యక్తి ఎన్టీరామారావు. అలాంటి ఆయన జీవితంలోకి వచ్చి ఆయన మనసును కాకావికలం చేసి, ఆయన ప్రాణాలకే ముప్పు తెచ్చారు. లక్ష్మీ పార్వతి చరిత్ర హీనురాలు కావున ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు చిన్నాపాటి ఉషారాణి ఏమన్నారంటే…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీరామారావు పేరును వైసీపీ ప్రభుత్వం మారుస్తుంటే లక్ష్మీపార్వతి కళ్లుండి కబోదిలా వ్యవహరించారు. గొప్పవ్యక్తి ఎన్టీరామారావుకి కీడు తలపెడుతంటే లక్ష్మీపార్వతి శాంతీయుతంగా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. తెలుగువారి ఔన్నత్యాన్ని కాపాడిన ఎన్టీరామారావు పేరు తొలగిస్తుంటే లక్ష్మీపార్వతి ఎలా సమర్థిస్తారు? పదవీ వ్యామోహంతోనే లక్ష్మీపార్వతి వైసీపీని సమర్థిస్తున్నారు. వీరగంధం సుబ్బారావును వదిలేసి నందమూరి తారక రామారావును పెళ్లి చేసుకున్నప్పుడే ఆమె హీన చరిత్ర బయటపడింది. ప్రజలు లక్ష్మీపార్వతిపట్ల అసహ్హించుకుంటున్నారు. పనిలేని, పనికిమాలిన మహిళలెవరైనా ఉన్నారంటే అది లక్ష్మీపార్వతినే. లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ లో మాట్లాడిన వాటికి క్షమాపణ చెప్పాలి.
టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాయత్రి ఏమన్నారంటే…
జగన్ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు లక్ష్మీపార్వతిని తెరముందుకు తెచ్చారు. ప్రభుత్వం రాష్ట్రానికి తెచ్చిన అప్పులు, ప్రజలపై మోపిన పన్నుల వివరాలు ప్రజలకు తెలపాలి. ఇవన్నీ ఎక్కడ బయట పడతాయోనని లక్ష్మీపార్వతిచే మట్లాడించారు. రాష్ట్రం నుండి పారిశ్రామికవేత్తలను తరలిపోయేలా చేసింది వైసీపీ కాదా? టీడీపీని విమర్శించేందుకు బుర్రకథలు చెప్పే లక్ష్మీపార్వతి, బూతు పురాణాలు చెప్పే కొడాలి నానీలే దొరికారా? మరెవరూ దొరకలేదా? వైసీపీ నాయకులకు వారు చేసే అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అనే భయం పట్టుకుంది. టూ రుపీస్, త్రీ రూపీస్ ఆర్టిస్టులతో ప్రెస్ మీట్లు పెట్టించడం వైసీపీ మానాలి.
రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా ఏమన్నారంటే…
అన్న ఎన్టీ రామారావు చనిపోగానే సూట్ కేసులు సర్దుకున్న వ్యక్తి లక్ష్మీపార్వతి. ఈ విషయాన్ని టీవీ5కి ఇచ్చిన ఒక ఇంటర్యూలో కూడా బహిర్గతపరిచారు. అన్న ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చి పచ్చని కుటుంబాన్ని పంగలపాలు చేశారు. లక్ష్మీపార్వతి ధనదాహంతోనే ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చారు. వీరగంధం, నందమూరి ఇంటిపేర్లు పెట్టుకున్న లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైఎస్ పేరు పెట్టుకున్నా ఆశ్చర్యంలేదు. జగన్.. లక్ష్మీపార్వతిని పావుగా వాడుకుంటున్న విషయం జగత్ విదితం. ప్రాధనమంత్రి కావాల్సిన అన్న ఎన్టీరామారావు జీవితంలోకి ఒక రాక్షసిలా లక్ష్మీపార్వతి ప్రవేశించారు. ఎన్టీరామారావుపే ఏమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా వెంటనే లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి.
టీడీపీ గుంటూరు పార్లమెంట్ జనరల్ సెక్రటరి షేక్ రిజ్వానా ఏమన్నారంటే…
కృష్ణా జిల్లా, ఎన్టీ రామారావు హెల్త్ యూనిర్శిటీలు లక్ష్మీపార్వతి అబ్బసొత్తా? అన్న ఎన్టీఆర్ పంచన చేరి వెన్నుపోటు పొడిచారు. లక్ష్మీపార్వతి వైసీపీకి ఒక కీలుబొమ్మ. ప్రతిపేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్న ఎన్టీ రామారావు పెట్టిన హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చడం అన్యాయం. లక్ష్మీ పార్వతి హీన చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. బ్రాందీషాపులకు భారతి, వైజాగ్ కు విజయసాయి, విజయవాడకు విజయమ్మ అని పేర్లు పెట్టుకొండిగానీ.. ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తామంటే మాత్రం తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మాత్రం ఊరుకునేది లేదు. అన్నగారి గౌరవానికి భంగం కలిగించే పని చేస్తే తగిన గుణపాఠం చెబుతాం.