Suryaa.co.in

Andhra Pradesh

ఎదురుదాడి కాదు.. మీకు దమ్ముంటే వీటికి జవాబు చెప్పండి సార్

– డీఎస్సీపై జగన్ సర్కారుకు 9 ప్రశ్నలు సంధించిన ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి

విజయవాడ: సమస్యలకు సంబంధించి నిర్దిష్ట ప్రశ్నలు లేవనెత్తుతున్న తన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తనపై చేతగానివారిలా వ్యక్తిగత దాడి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీకి సంబంధించి తాను సంధించిన 9 ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సవాలు విసిరారు.
నవరత్నాల ప్రభుత్వానికి షర్మిల సంధించిన నవ ప్రశ్నాస్త్రాలివే.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే,
ఆయన వారసుడిగా చెప్పుకొనే జగన్ ఆన్న కేవలం 6 వేల పోస్టులతో దగా డీఎస్సి చేశారని విమర్శించారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని,
అలాంటి వైసీపీ నాయకులు, వాళ్లను వెనకేసుకొచ్చే వైసీపీ సోషల్ మీడియాకు ఆమె 9 ప్రశ్నలు సంధించారు..

1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?
2. ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ?
3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ?
4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ?
5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ?
టెట్‌కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధా..?
6. వైఎస్సార్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కి గుర్తులేదా ?
7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?
8. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?
9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ?
ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?

నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులకు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ షర్మిల సవాల్ విసిరారు.

LEAVE A RESPONSE