– దినేష్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
అమరావతి: ఫైబర్నెట్ కేసు ముదురుపాకాన పడి.. కార్పొరేషన్ చైర్మన్ జివి రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఎండి దినేష్కుమార్పై బదిలీ వేటు పడింది. ఆయనను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫైబర్ నెట్తో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ సీఈవో.. గ్యాస్, డ్రోన్ కార్పొరేషన్ల బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.