Suryaa.co.in

Andhra Pradesh Telangana

హరీష్ రావు పై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి

-మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజు గా మారారు
-ఏపీ లో అన్ని పార్టీ లు మోడీ పార్టీ లుగా మారాయి
-మా ఆత్మ గౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదు
-అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
-కేసీఆర్ ఒకే ఒక ఎత్తుగడ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపింది
-800 రోజులు కార్మికులు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదు
-ఎమ్మెల్యే సైది రెడ్డి

హరీష్ రావు దేశం లో అందరు మంత్రులకు ఆదర్శం.ఏపీ లో ఎవరిని అడిగినా హరీష్ రావు గురించి చెబుతారు.హరీష్ రావు నడిచే యంత్రం, ఓ రోబో లాంటి వారని పేరుంది. విషయం లేకనే ఏపీ మంత్రులు రెచ్చి పోతున్నారు.ఏపీ మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజుగా మారారు. ఏపీ లో అన్ని పార్టీ లు మోడీ పార్టీ లుగా మారాయి.హరీష్ రావు లాంటి వారి మీద మాట్లాడేపుడు వంద సార్లు ఆలోచించుకోవాలి. తీరు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు అక్కడి మంత్రుల మీద ఉమ్మేస్తారు.

అభివృద్ధి ఎక్కడ ఎక్కువవుతుందో చర్చకు సిద్ధం. మా ఆత్మ గౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదు. దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ ,ఏపీ ల అభివృద్ధి పై నాతో ఏపీ మంత్రులు చర్చకు రావాలి. హరీష్ రావు ను మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా చర్చలో ఎదుర్కోలేదు.అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.అక్కడ పాలక ప్రతి పక్షాలు ఒకే తీరుగా ఉన్నాయి.

హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు.కేసీఆర్ ఒకే ఒక ఎత్తుగడ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపింది.800 రోజులు కార్మికులు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదు. మాతో అభివృద్ధి లో పోటీ పడండి. కేసీఆర్ అభివృద్ధి గురించి తప్ప దేని గురించి మాట్లాడరు. ఏపీ మంత్రులు అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. చంద్రబాబు, జగన్ ఎవరూ ఢిల్లీ వెళ్లినా తమ స్వార్ధం కోసం వెళతారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ ని ఏపీ అనుసరించాలి.రెండు రాష్ట్రాలు బాగుండాలి అనేదే మా తపన..దేశం కూడా బాగుండాలి.

LEAVE A RESPONSE