– బస్సులో వెళ్లినా.. రైళ్లల్లో వెళ్లినా ప్రజల ఛీత్కారమే
– టీడీపీకి పొత్తులు కొత్త కాదు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
మూడేళ్లలో ప్రజలపై ప్రభుత్వంచేసిన ఆకృత్యాలు, వారిపై వేసిన భారం అంతాఇంతాకాదు. బాదుడేబాదుడు కార్యక్రమంతో టీడీపీకార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, ప్రజలకు వాస్తవాలుచెబుతుండటంతో వారిలో వ్యతిరేకత మొదలైంది. చంద్రబాబు పర్యటనతో వైసీపీ కుర్చీలు కదిలాయి. బాబుగారి ఉత్తరాంధ్రపర్యటనతో రాష్ట్రమే షేక్ అయ్యింది.
గతంలో ఎన్టీఆర్ పార్టీపెట్టినకొత్తలో చైతన్యరథంపై తిరిగిన ప్రచారానికి వచ్చినప్పటి స్పందనే, ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనలో కనిపించింది. చంద్రబాబు పర్యటన విజయవంతంతో, గడపగడపకు వైసీపీని, గడపగడపకు ప్రభుత్వంగా మార్చారు. పథకాలపేరుతో ప్రజల్ని ఆకర్షించాలనిచూస్తే, అదికుదరలేదు. ఎక్కడికక్కడ జనం వైసీపీవారి చొక్కాలుపట్టుకోవడం మొదలెట్టారు.
బలహీనవర్గాలను ఆకర్షించాలనే లక్ష్యంతో బస్సుయాత్ర అంటున్నారు.బలహీనవర్గాలను టీడీపీని విడదీయడం ఎవరివల్లాకాదు. టీడీపీనే బలహీనవర్గాలు..బలహీనవర్గాలే టీడీపీ. రాష్ట్రంలోని ఎస్సీమంత్రులంతా ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీకార్పొరేషన్ తో ఈప్రభుత్వంలో ఎవరికైనా రూపాయిఇచ్చారా?
బీసీలకు ఈ ముఖ్యమంత్రి ఏంచేశాడో బీసీమంత్రులు చెప్పగలరా? మూడేళ్లలో బీసీలపై జరిగినదాడులు, వారిపైపెట్టిన తప్పుడుకేసులు వారికి కనిపించలేదా? పేదబీసీ విద్యార్థులకోసం తెచ్చిన విదేశీవిద్య తీసేశారు. బస్సులో వెళ్లినా.. రైళ్లల్లో వెళ్లినా ప్రజల ఛీత్కారమే మిగులుతుందని గుర్తుంచుకోండి. వైసీపీవారికి చివరకు మిగిలేది విమానయాత్రే.
టీడీపీకి పొత్తులుకొత్తకాదు. జగన్మోహన్ రెడ్డి తండ్రి పొత్తులు పెట్టుకున్న విషయం బొత్ససత్యనారాయణ, దర్మానప్రసాదరావుకు తెలియదా? పొత్తులతో టీడీపీకిపనిలేదు..రాష్ట్రాన్ని, ప్రజల్ని రక్షించడమే టీడీపీ పని.