– రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు ప్రధాన కూడలి వద్ద జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, వంశీ, రోజా పోస్టర్లు తగుల బెట్టిన రాజేంద్ర ప్రసాద్, ఇతర తెదేపా నాయకులు. ఈ రోజు ఉయ్యూరు పట్టణ మండల తెదేపా నాయకుల ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీ లో భువనేశ్వరి గార్కి జరిగిన అవమానానికి, చంద్రబాబు కన్నీటికి బదులుగా ఉయ్యూరులో చేపట్టిన నిరసన ర్యాలీలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ , బోడె ప్రసాద్.ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…
అన్న నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరి గార్ని అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన వైసీపీ నాయకులకు పుట్టగతులు ఉండవని, వారి సిగ్గు, సెరం లేని మాటలతో పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకం మొత్తం మనోవేదనతో ఇలాంటి వారికా మనం ఓట్లు వేసి గెలిపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, మన అసమర్థత ముఖ్య మంత్రి కేవలం బాబాయ్ గొడ్డలి వేటుని ప్రక్క త్రోవ పట్టించడానికే ఈ నాటకాలు ఆడిస్తున్నాడని, నువ్వు అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన సొంత తల్లిని, చెల్లిని ప్రక్క రాష్ట్రాలకు వెల్లగొట్టిన నువ్వు రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తావని, ఎన్నో గెలుపోటములు, ఓడుదుడుకులు చూసిన మా నాయకుని కంట కన్నీరు పెట్టించి సైకో ఆనందం పొందుతున్న మీరు మట్టికొట్టుకు పోవడం ఖాయమని, ఈ సందర్బంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా మనవి ఒక్కటే ఇవన్నీ చంద్రబాబు గారు చూడని పదవులు, అధికారాలు కాదని, కేవలం ఆంధ్ర రాష్ట్ర, మన బిడ్డల భవిష్యత్తు కోసమే మా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి తాపత్రేయం అని, దానికి ప్రజలందరూ సహకరిస్తే మేము మరింత పోరాడి మన రాష్ట్ర ఉనికి నిలబెడతామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమం లో ఉయ్యూరు పట్టణ, మండల అధ్యక్షులు గుర్నాధరావు, కుటుంబరావు,పిచ్చిరెడ్డి గారు,మచిలీపట్నం పార్లమెంట్ యువత అధ్యక్షులు చౌదరి, జబర్ల పూడి సర్పంచ్ ప్రసాద్, సాయిపురం సర్పంచ్ బాషా, కౌన్సిలర్స్ పండ్రాజు సుధారాణి, పలియాల శ్రీను మరియు ఉయ్యూరు మండల గ్రామాల, పట్టణ పార్టీ అధ్యకులు, కార్యదర్శులు,పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.