Suryaa.co.in

Andhra Pradesh

బాబు పాలన భేష్

– దుర్మమ్మను దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపి డికె అరుణ

విజయవాడ: సీఎంగా చంద్రబాబు ఏపీని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ కొనియాడారు. విజయవాడ పశ్చిమ బీజేపీ సుజనా చౌదరి ఎమ్మెల్యే మంచి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని డీకే అరుణ దర్శించుకున్నారు.

తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, అందరికీ మంచి జరగాలని కోరుకున్నానని చెప్పారు. గతం కంటే అమ్మవారి ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.

ఎన్నికలు అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావాలనుకున్నామని అయితే, ఆ సమయంలో వరదలు రావడంతో ఇక్కడకు రావడం ఆలస్యమయిందని చెప్పారు. అమ్మవారు విజయానికి ప్రతీక అని, తనకు కూడా మంచి విజయాన్ని అందించారని అన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వచ్చామని తెలిపారు.

LEAVE A RESPONSE