Suryaa.co.in

Andhra Pradesh Entertainment Telangana

పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ

ఢిల్లీ: నట సింహం నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.. 2025 ఏడాదికి సంబంధించి కేంద్రం మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి అవార్డులను అందజేయగా నందమూరి బాలకృష్ణ పంచె కట్టులో హాజరై అవార్డు అందుకున్నారు. ఈ శుభవేళ నందమూరి కుటుంబం దిగిన గ్రూప్ ఫొటో ఒకటి సోషల్‌మీడియాను ఆకట్టుకుంది. బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి, అల్లుళ్లు లోకేష్,భరత్‌తో కలసి ఫొటో దిగారు.

LEAVE A RESPONSE