5 లక్షల మంది పైన ప్రత్యక్షంగా సముద్రాలు, నదులు, చెరువుల మీద వేటకు
– కేవలం 1,29,278 మందికి మాత్రమే నామ మాత్రంగా మత్స్య కార భరోసా
– డీజిల్ రేట్లు పెంచి సబ్సిడీ ముసుగు
– వై యస్ ఆర్ సి పి బి సి సెల్ అధికార ప్రతినిధి నాగిడి సాంబశివరావు
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం మత్స్యకారులను నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. తాము విడుదల చేసే గణాంకాలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
మత్స్య కార భరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్ లో దాపు 40 లక్షల మంది మత్యకారులలో 5 లక్షల మంది పైన ప్రత్యక్షంగా సముద్రాలు, నదులు, చెరువుల మీద వేటకు వెళ్తూ మరో 5 లక్షల మంది పరోక్షంగా వేట మీద ఆధారపడి జీవిస్తుంటే కేవలం 1,29,278 మందికి మాత్రమే నామ మాత్రంగా మత్స్య కార భరోసా పేరుతో 258 కోట్ల కేటాయించి మిగతా వారి అందరికి అన్యాయం చేస్తున్నారని.. 2024 కి సంభందించిన మత్స్య కార భరోసా ఇప్పటికీ ఇవ్వకుండా ఇప్పుడు హామీ నెరవేరుస్తన్నామని హడావిడి చేస్తున్నారని నాగిడి సాంబశివరావు ఆరోపించారు.
లీటర్ డీజిల్ ధర 97 లకు పెంచి నామమాత్రం 9 రు సబ్సిడీకి డీజిల్.. అదికూడా మోటరైజ్డ్ బోట్ కి 300 లీటర్లు, మెకానైజ్డ్ బోట్ కి కేవలం 3000 లీటర్లు మాత్రమే ఇస్తూ మత్స్య కారులని మభ్య పెడుతున్నారని, వేట చేస్తూ మృతి చెందిన మత్స్య కారుల కుటుంబాలకు మత్స్య కార ప్రమాద భీమా అందక అనేక అవస్థలు పడుతున్నారని నాగిడి ఆవేదన వ్యక్తం చేశారు.
మత్స్య కార వృత్తి చేసే వారికీ ఇవ్వాల్సిన సబ్సిడీ రుణాలు ఇంకా రీలీజ్ చెయ్యలేదని, అప్కోబ్ ఛైర్మెన్ కు ఎలెక్షన్లు జరపగకుండా కాలక్షేపం చేస్తున్నారని మత్స్య కార కార్పొరేషన్, బెస్త కార్పొరేషన్స్ కి ఛైర్మెన్ డైరెక్టర్లు నియమించకుండా, బి సి కులాల వారికీ కార్పొరేషన్ వారీగా జనాభా ప్రతిపాదికిన నిధులు కేటాయించకుండా, బి సి కార్పొరేషన్స్ ని చంద్ర బాబు , పవన్ కళ్యాణ్ కలిసి నిర్వీర్యం చేస్తూ బి సి లకు అన్యాయం చేస్తున్నారని నాగిడి సాంబశివరావు ధ్వజమెత్తారు.
డీజిల్ సబ్సిడీ ని 50 రు లకు పెంచి, మోటరైజ్డ్ బోట్ కి 500 లీటర్లు, మెకానైజ్డ్ బోట్ కి 5000 లీటర్లు సబ్సిడీ డీజిల్ అందించాలని, 45 సంవత్సరాలకే మత్యకారులకు మత్స్యకార పెన్షన్ అందించాలని, పెండింగ్ లో ఉన్న మత్స్య కారులు అందరికి 10 లక్షల మత్స్య కార ప్రమాద భీమాలు విడుదల చెయ్యాలని, అప్కోబ్ ఛైర్మెన్ కు ఎన్నికలు, మత్స్య కార- బెస్త కార్పొరేషన్స్ కి ఛైర్మెన్, డైరెక్టర్లను వెంటనే నియమించాలని నాగిడి సాంబశివరావు డిమాండ్ చేసారు.
జగన్ ప్రభుత్వం హయం లో గతం లో ఎన్నడూ జరగని విధముగా మత్స్య కారుల కోసం 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు ప్రకటించి పనులు ప్రారంభించారని, అంతకు ముందు నామమాత్రంగా 4 వేలు ఉన్న మత్స్య కార భరోసాని 10 వేలకు పెంచి, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండ నిధులు విధుల చేసింది జగన్ మోహన్ రెడ్డి అని నాగిడి సాంబశివరావు గుర్తు చేశారు.