Suryaa.co.in

Andhra Pradesh

గోరంట్ల మాధవ్‌కు కండీషన్ బెయిల్ మంజూరు

గుంటూరు : వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రతి శనివారం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రెండు నెలలు సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం కేసులో గోరంట్ల మాధవ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE