కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాల్సిందే

– ఈఎస్ ఐ, సహార స్కాంలు చేసినవ్ కదా… వెలుగుబంటి సూర్యనారాయణతో కలిసి దోచుకున్నవ్ కదా…అవన్నీ తీస్తున్నం
– నీ దగ్గర తేలు మంత్రం ఉంటే… మా దగ్గర పాము మంత్రం ఉంది గుర్తుంచుకో
– ఈడనే పీకలేనోడివి… దేశానికి వెళ్లి ఏం పీకుతవ్?
– సీఎం ప్రెస్ మీట్ వ్యాఖ్యలు బుడ్డర్ ఖాన్ మాటలే
– నిన్ను మాత్రం అరెస్టు చేసి జైల్లో పెడతాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

దేశానికి విప్లవాత్మకమైన, చారిత్రత్మకమైన బడ్జెట్ అందించిన మోదీ, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు హ్రుదయ పూర్వక ధన్యవాదాలు. కరోనా టైంలో పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తారని మేధావులు, ఆర్థికవేత్తలు ఆలోచిస్తున్న ఈ తరుణంలో ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషకరం. నిర్మలా సీతారామన్, మోదీ దేశం కోసం జీవితాలను ధారపోస్తున్నరు. పైసా అవినీతి లేకుండా అహర్నిశలు పనిచేస్తున్నరు.

ఇప్పడే పిచ్చిపట్టి వాగిన సీఎం ప్రెస్ మీట్ చూసిన. ఇంత నీచపు బతుకు ఎందుకు బతుకున్నడో అర్ధం కావడం లేదు. తెలంగాణ ప్రజలు ఆయన వాడిన భాషను చూసి థూ.. అంటున్నరు. ఆయనకు పిచ్చి పట్టినట్లుంది. నీకు మతి తప్పినట్లుంది. కేంద్రం నీలాంటి మెంటల్ గాళ్ల కోసమే ప్రత్యేకంగా ఈ బడ్జెట్ లో మెంటల్ ఆసుపత్రుల ఏర్పాటు కోసం నిధులు కేటాయించినట్లుంది.

ఈరోజు సీఎం బండారం బయటపడింది. గత చరిత్రను తెరమరుగు చేసి సొంత చరిత్రను ప్రజలకు చెప్పుకోవాలని కుట్ర చేస్తుండు.రాజ్యాంగాన్ని తిరగరాయాలట. నీ అక్కసు ఇప్పుడు బయటపడింది. ఇన్ని రోజులుగా నువ్వు నీ కడుపులో దాచుకున్న దారుణం ఈరోజు బయట పెట్టుకున్నావు.
మహనీయుడు, స్పూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను దారుణంగా అవమానించినావు. ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా తయారు చేసిన రాజ్యాంగం మనది. ప్రపంచమంతా కీర్తించే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానిస్తవా?

సీఎంలో ఎంతో అహంకారం దాగి ఉంది. దళితులపట్ల నీకున్న కుట్ర ఈసారి బయటపడింది. దళితుడు కాబట్టే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తే ఆ మహనీయుడిని అవమానిస్తున్నావు.. దళిత ద్రోహివి నువ్వు. రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించావ్.

నువ్వు ఏనాడూ అంబేద్కర్ జయంతి, వర్దంతికి రాలేదు. 125 అడుగుల విగ్రహాన్ని పెట్టలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరగరాస్తుందని చెప్పింది కేసీఆరే… మేం ఏనాడైనా తిరగరాశామా? లేదే..మేం.. అంబేద్కర్ స్పూర్తి కేంద్రాలను పెడుతున్నం. దళిత సమాజం సీఎం వ్యాఖ్యలపై స్పందించాలి. లేకుంటే ఈ మూర్ఖుడు ఇంకా బరితెగించి మాట్లాడతడు.

కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాల్సిందే.పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కన్పిస్తోంది. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందే… ఈ మూర్ఖుడు దేశాన్ని ఏ విధంగా విచ్చిన్నం చేయాలని చూస్తున్నడో కుట్ర అర్ధం అవుతోంది. కొడుకును సీఎం చేయడానికే ఇదంతా…
500 కోట్లు ఇచ్చి ఒకాయనతో (పీకే) ఈ సీఎం అగ్రిమెంట్ చేసుకుండుట. నువ్వే మేధావివి కదా… నీకు ఇంకోడు ఎందుకు? నీ దగ్గర తేలు మంత్రం ఉంటే… మా దగ్గర పాము మంత్రం ఉంది గుర్తుంచుకో. దేశంలోనే పెద్ద అవినీతి పరుడివి నువ్వు. జైలుకు పోవడం ఖాయం. అందుకే తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నవ్…నిన్ను ఎవడూ కాపాడలేడు.

తెలంగాణ సమాజం అంతా నీ పట్ల కసితో ఉంది… నువ్వు జైలుకు పోతే చప్పట్లు కొట్టే రోజులు రాబోతున్నయ్. ఇన్నాళ్లూ మోడీ బడ్జెట్ నచ్చింది… ఇప్పుడు మాత్రం నచ్చలేదా? నీ అవినీతిని బయటపెడుతుంటే చెడ్డ వాళ్లం అవుతున్నమా? నీకు పేదల బడ్జెట్ ఎట్లా నచ్చుతది? నువ్వు నెంబర్ వన్ దేశద్రోహివి. చివరకు జర్నలిస్టులను కూడా మోసం చేస్తూనే ఉన్నడు ఇండ్ల స్థలాల పేరుతో….
బడ్జెట్ లో రైతుల ప్రస్తావన లేదా… ఎంఎస్ ఫీ కోసం ఈ ఏడాది 2 లక్షల 37 వేల కోట్లు గోధుములు, ధాన్యం కొనడానికి మాత్రమే బడ్జెట్ లో పెట్టారు. ఇది రైతుల బడ్జెట్ కాదా? రైతులు తెలంగాణలో కోటీశ్వర్లు అయితే నీ పాలనలో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నరు? వడ్ల కుప్పలపై ఎందుకు చనిపోయిండ్రు?

కొనుగోలు కేంద్రాలు ఎత్తిసిన నీచుడవు.. ధాన్యం కొనబోమని చెప్పిన మూర్ఖుడివి నువ్వు? కేంద్రానికి ధాన్యం కొనే ఆలోచన లేకుండా ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయిస్తుంది సీఎం గారు.
బీజేపీ అధికారంలోకి రాకముందు ఎంఎస్ పీ 1310 నుండి రూ.1960 పెంచినం. ఫ్రీ యూరియా అన్నవ్.. యాడపోయింది. పండించిన ప్రతి గింజా నేనే కొంటానంటివి. మరెందుకు కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నవ్? పొలిటికల్ గూండా గిరి తెలుస్తుంది… గుడుంబా పోయింది గంజాయి, డ్రగ్స్ వచ్చినాయి. ఈడనే పీకలేనోడివి… దేశానికి వెళ్లి ఏం పీకుతవ్? 2018 ఎన్నికల తర్వాత సారు-కారు-16 అన్నావు… థర్డ్ ఫ్రంట్ అన్నావు.

317 జీవో పేరుతో ఉద్యోగుల్ని అవమానిస్తున్నావు. నీ జీవో మంచిదైతే 10 మంది ఉద్యోగులు ఎందుకు సూసైడ్ చేసుకుంటరు? భార్యాభర్తల్ని విడదీసిన మూర్ఖుడిని నువ్వు. పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని విడదీసిన మూర్ఖుడివి నువ్వు.సిగ్గులేకుండా జీవోను సమర్ధించుకుంటావా?… థూ…
పైగా నిరుద్యోగులను రెచ్చగొట్టి లాగులు పగలకొట్టండని ఉద్యోగులను కించపరుస్తవా?. ఇద్దరి మధ్య కొట్లాడ పెట్టాలనుకుంటున్నవా?1.5 లక్షల ఉద్యోగాలిచ్చానడం పచ్చి అబద్దం… కొత్త ఉద్యోగాలిస్తానని ప్రతి ఎన్నికలప్పుడు ఊరిస్తున్నావే తప్ప నోటిఫికేషన్లు ఏవి? ఉద్యోగాలిస్తే… నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ఖర్మ ఎందుకు వస్తది?
నువ్వే పెద్ద మిడతవు. అంతకంటే డేంజర్ మనిషివి నువ్వు. ఈరోజు 2 గంటల సీఎం ప్రెస్ మీట్ వ్యాఖ్యలు బుడ్డర్ ఖాన్ మాటలే. సీఎం కు కొంచేమైనా బుద్ది లేనట్లుంది.. అబద్దాలాడితే తిడతారనే సోయి కూడా లేకుండా పోయింది.

కేసీఆర్ ది నాలుక కాదు.. తాటి మట్ట.కరోనా వచ్చినప్పుడు నువ్వు యాడపోయి పడుకున్నవ్? ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిందెవరు? నువ్వు ఉద్దరించేందేమిటి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల్లేక పేదలు చచ్చిపోతే కనీసం ఎందుకు స్పందించలేదు? ప్రపంచానికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మనదే.. నీ ఇంటి పక్కనుండే ఫ్రీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి మోదీగారు వచ్చేదాకా తెల్వదు.

గుజరాత్ పోయి అక్కడి పథకాలను కాపీ కొట్టిన నువ్వా మాట్లాడేది? ఇక్కడ మూసీలో నువ్వు దూకి ఈతకొడతవా? నేను సబర్మతిలో ఈత రాకపోయినా ట్యూబ్ వేసుకుని ఈద కొడతా. ఉపాధి హామీ నిధులు తగ్గించినట్లు చెప్పడం అబద్దం… ఉద్యోగాలకు, ఉపాధికి సంబంధం ఏంది? ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఇంకా తట్ట మోసుకుంటూ పని చేయాలని నీ ఉద్దేశమా?
ఎరువులు ఫ్రీ ఇస్తా.. అద్బుతాలు స్రుష్టిస్తానని చెప్పి మూడేళ్లయినా ఎందుకివ్వలేదు. నువ్వు ఫక్తు మోసగాడివి. నువ్వు జనాలను మోసం చేయడానికే పుట్టినవ్.

నువ్వు వేసుకున్న వ్యాక్సిన్ ఫ్రీగా వేసినమనే సంగతి గుర్తుంచుకో… దేశం మొత్తానికి ఫ్రీగా ఇచ్చిన ఘనత మోదీదే. నీవన్నీ బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నవ్.. ఎరువులు ధరలు పెంచనేలేదు… గ్రామీణ ఉపాధి హామీ నిధులు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కరోనా వల్ల గతేడాది 40 వేల కోట్లు అదనంగా కేటాయిస్తే… ఈసారి అందులో 15 వేల కోట్లు ఉద్యోగాలు, ఉపాధి పోయి ఏడుస్తుంటే… ఏం చేస్తున్నవ్. చదువుకున్నోడు తట్ట మోయాలా? ఉద్యోగాలకు, ఉపాధి హామీకి లింక్ ఏంది?

గుజరాత్, మధ్య ప్రదేశ్ లో చేస్తున్న పథకాలు చెబుతా.. అమలు చేసే దమ్ముందా? ఏ రాష్ఠ్రానికి సపరేట్. వాళ్ల ప్రజలకు కావాల్సిన అవసరాల మేరకు పథకాలు రూపొందించి అమలు చేస్తరు. నీ సైజు పాయింట్ నీది.. నా పాయింట్ సైజు నాది… ఉత్తర ప్రదేశ్ లో ఏకమొత్తంగా ఒకేసారి రుణమాఫీ చేశారు.చత్తీష్ఘడ్ లో ఏడేళ్ల కిందనే రమణ్ సింగ్ ఆధ్వర్యంలో, అంతకంటే 12 ఏండ్ల ముందు గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫ్రీగా ఇస్తున్నం. మేం డిస్కంలకు డబ్బులు కడుతున్నం. మీరెందుకు కట్టడం లేదు?

ఎస్సీ, ఎస్టీలకు 40 కోట్ల జనాభా 12 700 కోట్లు కేటాయించారనే అంశంపై… బడ్జెట్ లో వంద రకాల పథకాలుంటయ్. ప్రతి స్కీంలో దళితులు భాగస్వాములే. మరి 12,700 కోట్ల సంగేతింది? 33611 కోట్లు రాష్ట్రంలో దళితులకు ఎట్లా ఇచ్చినవ్? హుజూరాబాద్ లో దళిత బంధు అమలు చేయలేక చేతులెత్తేసినవ్..

రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పడంపై…. రైతు చట్టాలపై సరిగా వివరణ ఇవ్వలేకపోయానని క్షమాపణ చెప్పారే తప్ప చట్టాలకు వ్తయిరేక కాదు.. యూరియా, ఎరువుల కోసం సబ్సిడీ తగ్గింపుపై… ఇది రైతు ఫ్రెండ్లీ బడ్జెట్. సేంద్రియా వ్యవసాయం పెంపు, ఆర్గానిక్ ఫార్మింగ్. డ్రోన్ల ద్వారా ఎరువుల చల్లడం దానివల్ల వ్యయం తగ్గుతుందని చెబుతున్నరు.

నరేగా 96 వేల కోట్ల నుండి 73 వేల కోట్ల తగ్గింపుపై… 2019-20లో 50 వేల కోట్లు.. కరోనా వల్ల అదనంగా రూ.40 వేల కోట్లు పెంచారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందున దీనిని 73 వేల కోట్లు… అంటే గతం కంటే పెంచినం. నీవన్నీ దొంగ లెక్కలు.

మిషన్ భగీరథ్ ముందు గుజరాత్ వెళ్లి సుజలాం… సుఫలాం పథకం సూపర్ అని ఎందుకు కితాబిచ్చిండు… నీది నోరా… పెంట కుప్పా?. మిడితల కథపై… నువ్వే పెద్ద మిడితవ్.. .హెల్త్ ఇన్ ఫ్రా బడ్జెట్ లో నిధులు పెట్టలేదు. పోయినసారి బడ్జెట్ లో నిధులు పెట్టకపోయినా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినం. నీ మాటలు దయ్యాలు వేదాలు..
తెలంగాణలో 10 వేల కోట్ల పెంపుపై… హెల్త్ ఇన్ ఫ్రా అంటే అర్ధం తెలుసా? పీహెచ్ సీల స్థాయి హెల్త్ ఇంప్రూప్. కింది స్థాయిలో తగ్గించాలని మేం చర్యలు. హంగల్ ఇండెక్స్ పై… అసలీ లెక్కలు తీసిందెవరు? ఆ సంస్థ ఎవరిది? హంగర్ ఇండెక్స్ ఇచ్చేటోడు ఎవడు? ఎక్కడో అమెరికాలో, యూరప్ లో కమ్యూనిస్టు ఎవడో, ఊరుపేరు లేని ఎవడో రాస్తే నువ్వు చదువుతున్నవ్. అసలు నీకు తెలిసి మాట్లాడుతున్నడు.. నువ్వు మాట్లాడతవా? ఈ దేశంలో ఆకలితో ఎవరూ పడుకోవడం లేదు. కరోనా సంక్షోభంలోనూ ఎవరూ ఆకలితో ఉండకూడదని ఫ్రీగా బియ్యం, గోధుములు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నం.

ఆహార సబ్సిడీ 60 వేల కోట్ల తగ్గింపుపై… ఇది కరెక్టు కాదు. కరోనా సమయంలో దేశంలో ప్రజలకు ఉచిత బియ్యం, గోధుములు సరఫరా చేసినం. ఇప్పుడు కరోనా పరిస్థితి లేదు. వాటిని మాత్రమే తీసేసినం. దీనికి బడ్జెట్ తగ్గిటంచినట్లు కథలు చెబుతావా?
ఎయిరిండియా విలీనం.. సేవా రంగం ఆరోగ్య పోటీ తో వ్రుద్ది చెందాలని… వీటికి ప్రజల సొమ్మును ఖర్చు చేయాల్సిన అవసరం లేదనేది కేంద్ర విధానం. ఎల్ ఐసీ వంటి రేషనలైజ్ చేసేందుకు డిజిన్విస్ట్ మెంట్ చేస్తున్నం. నష్టపోయిన సంస్థలు 50 వరకు ఉంటే… లాభాల్లో ఉణ్నవి ఒకటి అరా ఉంటయ్..
2022 రైతుల ఆదాయం రెట్టింపుపై… కనీసం 1310 ఉంటే.. 1960 అయ్యింది. దీంతో పాటు నీళ్లు, కరెంట్, ఎరువులు, యూరియా సబ్సిడీలు ఇచ్చి రైతుల ఖర్చు తగ్గింపు ఆదాయం పెంచలా చేసినం.
ఆవాస్ యోజన 80 లక్షల మంది ఇండ్ల నిర్మాణం కోసం రూ.48 వేల కోట్లు కేటాయించినం. నువ్వు చేసిందేమిటి? గత ఏడున్నరేళ్లలో తెలంగాణలో కట్టిన ఇండ్లు 8 వేలు మాత్రమే. లక్షల ఇండ్లు కట్టినవని చెబుతున్నవ్ కదా.. దమ్ముంటే బయటపెట్టు?

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లకు నిధులిచ్చిన మాట వాస్తవం కాదా? నీకు దమ్ముంటే లబ్దిదారుల జాబితాను బయటపెట్టు.15 లక్షల ఉద్యోగాల ఖాళీ, రూ.15 లక్షల ప్రతి ఖాతాలో జమపై బ్లాక్ మనీ చాలా ఉంది. దానిని వెలికి తీయగలిగితే ఒక్కోక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేసే అవకాశం ఉంది అని మాత్రమేనని అన్నరు. దీనిపై అడ్డగోలుగా మాట్లాడుతున్నరు మోదీల పేర్లు చేబుతూ… దేశం దాటిన వాళ్లంతా కాంగ్రెస్ హయాంలో స్కాంలు చేసి పారిపోయినోళ్లే… వాళ్లను అరెస్టు చేసి ఆస్తులు సీజ్ చేస్తుంటే… భయపడి పారిపోయిండ్రు. నిన్ను మాత్రం ఈ దేశం వదిలి పారిపోనీయం బిడ్డా.. అరెస్టు చేసి జైల్లో పెడతాం..
ఆర్బిట్రేషన్ సెంటర్ పై…. సీజేఐని వివాదాస్పదం చేసిన ఘనుడు కేసీఆర్. గౌరవప్రదమైన ప్రధానిని, సీజేఐని చౌకబారు విషయాల్లోకి లాగుతారా? ఛీ.. థూ… నీ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడం లేదు..
నదుల అనుసంధానంపై… నువ్వు కాళేశ్వరం నుండి కొండ పోచమ్మ సాగర్, నల్గొండకు నీళ్లిస్తానన్నవ్. మేం కేంద్ర నిధులతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు మేలు అవుతయ్. కావేరి నుండి వచ్చేవి సర్ ప్లస్ నీళ్లు. తెలంగాణ నీటిని ఒక్క చుక్క కూడా పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లం. బుందేల్ ఖండ్ తరహాలో అందరికీ నీళ్లు.

5 వారాలు మాత్రమే అయ్యింది నువ్వు డీపీఆర్ ఇచ్చింది. ఇవ్వగానే చూసి ఓకే అనడానికి ఇదేమీ సినిమా కాదు. నువ్వు ఎంత ఖర్చు చేసినవ్. దొంగ డీపీఆర్ లు ఇచ్చింది నువ్వు… నీ సంగతి తేలుస్తం?
నదుల అనుసంధానం చేస్తానని మొదటి నువ్వు కూడా చెబుతున్నవ్ కదా. ఏపీ సీఎం ను పిలిచి ఇదే మాట చెప్పినవ్ కదా.కేంద్రం నిధులతో నదుల అనుసంధానం చేస్తానంటే నీకొచ్చిన నొప్పి ఏంటి? నీ కమీషన్లు పోతయని భయమా? సంగమేశ్వరం ప్రాజెక్టకు తెలంగా నీళ్లను దోచిపెట్టిన నువ్వు.కేంద్రంపై మాట్లాడతావా?

క్రిప్టో కరెన్సీపై.. క్రిప్టో కరెన్సీ రకరకాలు.. అందులో డిజిటిల్ రూపీని ప్రమోట్ చేస్తున్నం. డిజిటిల్ ట్రాన్జెక్షన్స్ పెరగాలని.. ప్రపంచవ్యాప్తంగా లీగల్ ట్రాన్జెక్షన్స్ జరుగుతున్నా ట్యాక్స్ లు కట్టడం లేదు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని 30 శాతం పన్ను విధించాం. ఈ దేశాన్ని కాపాడేటోళ్లు చాలా మంది ఉణ్నరు.
నీటి వాడకంపై… 65 వేల టీఎంసీలో గోదావరిలో 2 వేల టీఎంసీలు.. వాడుకోవాలని మొదటి నుండి చెబుతున్నం. టిబెట్ గురించి నీకేం తెలుసు? అది చైనాలో భాగం.. ప్రతిరోజు అంతర్జాతీయ సమస్య. దీనిపై కొట్లాడుతున్నం. నువ్వు బుడ్డర్ ఖాన్ లెక్క మాట్లాడకు. నదుల అనుసంధానంపై దేశం చూసుకుంటుంది.

జల్ జీవన్ మిషన్ మిషన్ కింద ఈ ఏడాది బడ్జెట్ లో మాత్రమే 60 వేల కోట్లు కేటాయించినం. మొత్తం ఈ స్కీం కింద కేటాయించిన బడ్జెట్ రూ.3.5 లక్షల కోట్లు. గత ఏడాది 40 వేల కోట్లు పెట్టినం. గత రెండేళ్లలో 7 కోట్ల మందికి తాగు నీరు. ఈ ఏడాది 5 కోట్ల మందికి లబ్ది. కనీసం ఈ మిషన్ గురించి తలాతోక తెల్వదు. పిచ్చికుక్కలా మాట్లాడుతున్నవ్. నువ్వు చేస్తే రైటు.. మేం చేస్తే రాంగా? ఇదెక్కడి ద్వంద్వ నీతి? మిషన్ భగీరథను కమీషన్ భగీరథ చేసినవ్. 10 వేల కోట్లతో అయ్యేది 40 వేల కోట్లకు పెంచి కమీషన్లు దొబ్బినవ్. పైపుల పేరుతో డబ్బుల దంచుకుంది నిజం కాదా? మీ లెక్కనే అందరూ చేస్తారనుకుంటున్నవా?

సమతామూర్తి విగ్రహంపై …… ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానికి బీజేపీకి, మోడీకి లింకు పెట్టావంటే.. నీదెంత చీప్ బుద్దో అర్ధం చేసుకోవాలి. ప్రధాని వచ్చే కార్యక్రమంపై రాజకీయం చేస్తావా? నిన్ను ఎవరూ పట్టించుకోరనే ఆక్రోశంతోనే ఈ విషయంపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నరు.
తెలంగాణ కు నిధుల కేటాయింపుపై…. రాష్ట్రాల వాటాను 32 నుండి 41కి పెంచినం. నీవన్నీ అబద్దాలే. ఆల్రెడీ గత 8 ఏండ్లలో 2.72 లక్షల కోట్లు ఇచ్చినవ్.
1.31 లక్షా ఉద్యోగాలిచ్చినం. ఇంకో 40 వేల ఉద్యోగాలిస్తున్నవ్. నువ్వు సీఎంగా ఉంటూ… ఇంటర్నేషనల్ సంస్థలొచ్చి ఉద్యోగాలిస్తానంటే… వాడు, వీడు అంటూ హేళన చేస్తావా? నీకు టీఎస్ పాస్ కాదు.. నీకు సంస్కారం లేదు. సంస్కార పాస్ పెట్టుకో.. బెల్టు షాపుల పెట్టి మందు తాగిస్తూ రెవిన్యూ పెంచుకుంటున్నవ్?

కొత్త రాజ్యాంగంపై… అంబేద్కర్ ను అవమానిస్తవా? అంత పెద్ద మొగోడివా. దళితుడు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం నీకు అసలు ఇష్టమే లేదని తెలుస్తోంది. దేశంలో కరోనా టైంలో 9శాతానికి పైగా గ్రోత్ ఉంది. నువ్వు ఎకో గురించి మాట్లాడతావా? సిగ్గుందా?
గుడుంబా, డ్రగ్స్, పేకాట, భూ కబ్జాల్లేవంటవా?… నీతో సహా పక్కన కూర్చోన్నళ్లంతా భూ కబ్జాదారులే.. దళిత బంధు పై… ఇది వాస్తవమే అయితే మరి ఎందుకు అమలు చేయడం లేదు? నిధుల కేటాయింపు ఏధి? సోషల్ మీడియా క్షుద్ర విద్యపై… ఇది వ్యక్తులు చేసే పని.. రోజుకు వందల వేల మంది పోస్టులు పెడుతుంటరు. దానికి బీజేపీకి లింక్ పెడితే ఎట్లా?
317 జీవో విషయంలో, గతంలో సీఎం ఇచ్చిన హామీల అమలు కోసం టీఆర్ఎస్ పై ప్రజలు తిరగబడుతున్నరు. దీనిని దారి మళ్లించేందుకు తెలంగాణ సెంటిమెంట్ తో మరోసారి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండు.

ఉచిత కరెంట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు.. అయితే డిస్కంలకు చేస్తున్న పేమెంట్లను ఎగ్గొడుతూ దివాళా తీయిస్తున్నరు. మీరు ఎంతమంది రైతులకు కరెంట్ ఇస్తున్నరో లెక్క తీసి ఆ సొమ్మును డిస్కంలకు చెల్లించాలే తప్ప దివాళా తీయించొద్దన్నదే కేంద్రం విధానం. మోటార్లు మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు? ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే… బీజేపీ పాలిత రాష్ఠ్రాల్లోనూ ఉచిత విద్యుత్ అమలవుతోంది.

యూపీలో సీట్లు తగ్గుతాయన్న వ్యాఖ్యలపై…. కారు, సారు, పదహారు అంటివి. బీజేపీ ఎక్కడుందంటివి… హుజూరాబాద్ లో , దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ ఎక్కడుందో చూపెట్టినం. నీకు వచ్చే ఎన్నికల్లో మిగిలేది 5 సీట్లే. హంగర్ ఇండెక్స్ ఆకలి సూచిలో భారత్ ది 101 స్థానం అని ఎవడో చెబితే నువ్వు చెబుతున్నవ్…. కానీ గూగుల్ లోకి వెళ్లి చూడు.. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే నీ పేరే వస్తది… నువ్వు ఒప్పుకుంటావా?

కమీషన్ల దండుకోవాలనే ఉద్దేశంతో నదుల అనుసంధానంపై ఏపీ సీఎంతో కలిసి మాట్లాడింది నువ్వు కాదా? కేంద్రం నదుల అనుసంధానం చేస్తే కమీషన్లు దండుకునే అవకాశం ఉండదనే అక్కసుతో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తావా? నీ భాషను చూసి కుక్కలు, నక్కలు కూడా సిగ్గు పడుతున్నయ్…
అంబేద్కర్ నే అవమానించావంటే నీ కంటే డేంజర్ ఎవరూ లేరని అర్ధం అవుతోంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచించాలి. సీఎం భాష, అంబేద్కర్ ను అవమానించిన తీరుపై ఒక్కసారి ఆలోచించాలి. నరేంద్రమోదీని అప్రదిష్టపాల్జేసే కుట్రలో భాగంగానే కేసీఆర్ నీచమైన, బూతు భాషను ఉపయోగిస్తున్నరు.

నువ్వు బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తవా?…. నిన్ను ఆల్రెడీ జనం సముద్రంలో విసిరేసేందుకు సిద్ధంగా ఉన్నరు. నువ్వు మాపై ఎన్ని దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదు… జైళ్లు మాకు కొత్త కాదు…
ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడితే కొట్టించినవ్… ఉద్యోగుల పక్షాన కొట్లాడితే జైల్లో వేసినవ్. రైతుల తరపున, నిరుద్యోగుల తరపున, పోడుభూముల కోసం కొట్లాడితే మాపై దాడులు చేయించినవ్… భయపడ్డమా? మేం చావడానికి… త్యాగాలు చేయడానికై సిద్ధమై వచ్చిన.తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. పేదలు బతకలేని పరిస్థితి. ప్రజలు ప్రశ్నించలేని పరిస్థితి. అందుకే నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగాలకు సిద్ధపడే పోరాడుతున్నం. సీఎం…తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలని చూస్తవా? బిడ్డా… నీకు చుక్కలు చూపిస్తాం…

నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. నువ్వు జైలుకు పోవడం ఖాయం… అందుకే లాలూ నీకు జైలు ఎట్లుంటదో చెప్పి పోయినట్లుండు. సీఎం ఫుల్ డిప్రెషన్ లో ఉన్నడు.
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ ఐ, సహార స్కాంలు చేసినవ్ కదా… వెలుగుబంటి సూర్యనారాయణతో కలిసి దోచుకున్నవ్ కదా…అవన్నీ తీస్తున్నం…సీఎంగా ఉంటూ వేల కోట్లు దోచుకుతింటున్నవ్ కదా… అవన్నీ బయటకు వస్తున్నయ్.

భారత రాజ్యాంగాన్ని కల్వకుంట్ల రాజ్యాంగంగా మార్చాలనుకుంటున్నవ్… నువ్వు కాదు కదా.. నీ తాత తరం కూడా కాదు.. గుర్తుంచుకో.ప్రధాని లాంటి వ్యక్తులను కూడా వాడు వీడు అంటూ మాట్లాడుతున్నవంటే… నీ కళ్లు నెత్తికెక్కినయని అర్ధమైంది. చివరకు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతానంటే కూడా వాడు.. వీడు అని చెబుతుండంటే ఎంత అహంకారం ఉందో అర్ధమైతోంది. టీఎస్ ఐపాస్ కాదు… ముందు సంస్కారం నేర్చుకో… అందుకోసం సంస్కార ఐపాస్ పెట్టుకో…సంస్కార హీనుడిగా మారకు… ఇట్లనే ఉంటే నీ పరిస్థితి ఎట్లుంటదో ఒక్కసారి తెలుసుకుని మాట్లాడు. ఇకనైనా సీఎంను హెచ్చరిస్తున్నా.. నీ భాష ఇకనైనా మార్చుకో.

బీజేపీ మాటనే కేసీఆర్ పలుకుతోండనే వ్యాఖ్యలపై…. అసలు దేశంలో, రాష్ఠ్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది? దాని గురించి మాట్లాడటం అనవసరం.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేయబోతున్నరు. అందుకే కలిసి కార్యక్రమాలు చేస్తున్నరు. వాళ్లకు కూడా అర్ధమైంది. ప్రజలు రాష్ఠ్రంలో టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని జనం నిర్ణయానికి వచ్చిండ్రు.

నేను మోదీ అపాయిట్ మెంట్ ఇప్పిస్తా… నీకు దమ్ముంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటున్నవ్ కదా.. దమ్ముంటే వెళ్లి మాట్లాడు.. అయినా ఇన్ని రోజులు ఏం చేసినవ్… తెలంగాణ సెంటిమెంట్ రగల్చి బ్లాక్ మెయిల్ చేసేందుకే కేసీఈర్ ఇదంతా చేస్తున్నడు. ఎందుకంటే జైలుకు పోతడని అర్ధమై డిప్రెషన్ లోకి వెళ్లి ఇదంతా చేస్తుండు. కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా.. సెంటిమెంట్ రగిల్చాలనుకున్నా అది సాధ్యం కాదు.. ఎందుకంటే కేసీఆర్ సంగతి అర్ధమైపోయింది. ఆయన అరెస్టు కావడం తథ్యం.

ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు… తరువాత రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలంతా మనవాళ్లే.. మేం తెలంగాణ అభివ్రుద్ధి కోసం పాటు పడుతూనే ఉంటం. నేనడుగుతున్నా… బడ్జెట్ టైంలోనే ఈ నాటకాలెందుకు కేసీఆర్.. ఇన్నేళ్లు, ఇన్నాళ్లు ఏం పీకినవ్.. ఎందుకు మాట్లాడలేదు?

Leave a Reply