Suryaa.co.in

Telangana

ఓటేసిన డిప్యూటీ సీఎం భట్టి

మధిరలోని సుందరయ్యనగర్‌ ప్రాథమిక పాఠశాలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ఓటు హక్కును వినియో గించుకునే అవకాశం కోల్పోతే ప్రజాస్వామ్య పునాదులను, లౌకికవాదాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగాన్ని, మన సంపద, వనరులు, వ్యవస్థలు, ఆస్తులను కాపాడుకునేందు కు ఓటు హక్కును ఒక ఆయుధంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE