తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్

కేసీఆర్ తన చెప్పు చేతల్లో ఉండే పోలీసులతో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభను అడ్డుకోవాలని చూసాడు.బహిరంగ సభకు కోర్టు అనుమతి ఇచ్చింది.ఇంత పెద్ద పార్టీ బహిరంగ సభ 2 గంటలే ఉంటుందా?కోర్టు ఎప్పుడూ కూడా ప్రజల పక్షానే ఉంటుంది.కేసీఆర్ పాలనలో చదువులమ్మ ఒడి అయిన బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని చేశారు. విద్యార్థుల ఉద్యమంతో కేసీఆర్ కొడుకు కేటీఆర్ దిగి వచ్చాడు. బాసర విద్యార్థులకు హ్యాట్సాఫ్.రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి భోజనం పెట్టకపోవడంతో… బల్లులు పడ్డ అన్నం తిని, విద్యార్థులు అనారోగ్యం పాలై, హాస్పిటల్ కు వెళ్తున్న పరిస్థితి.ప్రజలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు.కేసీఆర్ ను ఓడగొట్టడమే మా ఎజెండా అని ప్రజలు అనుకుంటున్నారు.కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి… చేతలు మాత్రం గుమ్మం కూడా దాటవు.కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసులు ఎంతమంది బీజేపీ కార్యకర్తల పై కేసులు పెడతారు?తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.రాబోయే కాలంలో పులి బిడ్డల్లా ఆదిలాబాద్ ప్రజలు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నా.

Leave a Reply