కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు పోలేదు

-కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ పాలన
-అప్పుల తెలంగాణ, మద్యం తెలంగాణగా కేసీఆర్ మార్చేశారు
-అది దళిత బంధు కాదు… ఈటల రాజేందర్ బంధు
వేయి మంది కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ లు వచ్చినా నరేంద్రమోదీ ని అడ్డుకోలేరు
-బీజేపీ అధికారంలోకి వచ్చాక, ప్రతి అవినీతి పై దర్యాప్తు చేస్తాం
-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నాడో… ఫార్మ్ హౌజ్ లో ఉన్నాడో తెలీదు.ఇవాళ 5వ విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నాం.ఇప్పటికే 4 విడతల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేశాం.అడుగడుగునా బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్.కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు పోలేదు. ఇక్కడ మాత్రం ఉద్యమం లో జైలుకు వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు.

మీ కుటుంబ, అవినీతి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతా0.నిన్న ఆడబిడ్డ అని కూడా చూడకుండా వైఎస్ షర్మిల వాహనాన్ని trs కార్యకర్తలు తగలబెట్టారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు?తెలంగాణ ను అప్పుల తెలంగాణ, మద్యం తెలంగాణగా కేసీఆర్ మార్చేశారు.ఒక్క గ్రామంలో 30 బెల్ట్ షాప్ లు ఉన్నాయి. ఇది కేసీఆర్ సాధించిన ఘనత.

కేసీఆర్ కు ప్రధాని, గవర్నర్, రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులపై గౌరవం ఉండదు.యాత్రను అడ్డుకుంటూ… అక్రమ కేసులు పెడుతున్నారు.కేసీఆర్ ఆదేశాలతో… Trs పార్టీ ఏజెంట్స్ లా పోలీసులు వ్యవహరిస్తున్నారు.తెలంగాణలో కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది.ఎవరూ శాశ్వతం కాదు.2024 పార్లిమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేసీఆర్ కు రాదు.

బీఆర్ఎస్ పెట్టి నరేంద్రమోదీ ని కేసీఆర్ అడ్డుకుంటాడా?వేయి మంది కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ లు వచ్చినా నరేంద్రమోదీ ని అడ్డుకోలేరు.కేసీఆర్ చేసిన అనేక అవినీతి కుంభకోణాల మీద… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, ప్రతి అవినీతి పై దర్యాప్తు చేస్తాం. ప్రజలకు పంచుతాం.ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదు?Mmts 2nd phase ఎందుకు స్టార్ట్ చేయడం లేదు?ఇసుక, గ్రానైట్, సున్నపు quaries, భూములు అన్నీ కేసీఆర్.ఈటల ను హుజురాబాద్ లో ఓడించేందుకే దళిత బంధు వచ్చింది.అది దళిత బంధు కాదు… ఈటల రాజేందర్ బంధు.గిరిజన బంధు ఎటు పోయింది?రాష్ట్రంలో భూ మాఫియా విచ్చలవిడిగా చెలరేగింది.కేసీఆర్ అస్తవ్యస్త పాలన కారణంగా… రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం వచ్చే పరిస్థితి వచ్చింది.ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు.

ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్… ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు.8 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా కేసీఆర్ ఇవ్వలేదు.Trs పార్టీ ప్రజల రక్తం తాగుతోంది.నాకు పోలీసులు, మజ్లిస్ పార్టీ, డబ్బు ఉందని కేసీఆర్ అనుకుంటున్నాడు.కేసీఆర్ కుటుంబం పై బీజేపీ యుద్ధం ప్రకటించింది.ప్రజలకు నీతివంతమైన పాలన ఇచ్చేందుకే బీజేపీ పోరాడుతోంది.

Leave a Reply