పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజన చేయాలి

-కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఆధీనంలోని పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజన చేయాలి
-కేంద్ర ప్రభుత్వానికి బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్

కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ప్రపంచ కార్మిక దినం అయిన మేడే సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమై సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టు విభజన జరగక పోవడం వల్ల తెలగాణ రాష్ట్ర కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ కోర్టు విభజన జరగక పోవడం వల్ల లెక్కలేనన్ని కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోకుండా కార్మిక వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టు తక్షణమే విభజించాలని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేరువేరుగా ఈ కోర్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేరువేరుగా పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టు ఉంటే కార్మికుల సమస్యలు, కోర్టులో ఉన్న కేసులు సత్వరంగా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మిక లోకం ముందుకు సాగాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

Leave a Reply