దిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం వెల్లడించింది. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చాయని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ ఈమేరకు జవాబిచ్చింది. 2019-21మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్బీఐ ₹11,937 కోట్ల రుణాలివ్వగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా ₹10,865కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹7వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ₹2,970 కోట్లు, కెనరా బ్యాంక్ ₹ 4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ₹7,50 కోట్లు, ఇండియన్ బ్యాంక్ ₹ 5,500కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ₹1,750కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ₹5,633 కోట్లు, యూనియన్ బ్యాంక్ ₹6,975 కోట్లు ఇచ్చాయి.
Devotional
ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
ఉగాది ఆచారాలు – సత్ఫలితాలు
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…