Suryaa.co.in

Telangana

దేశ చరిత్రలో నిలిచే విధంగా బిఆర్ఎస్ బహిరంగ సభ

– కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనకే ప్రజలు విసిగిపోయారు
– మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ 

హైదరాబాద్: పహల్ గాం లో ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల దాడిని సీరియస్ గా తీసుకోవాలి. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. దేశం గురించి ఆలోచించాలంటే ఉగ్రవాదులు భయపడాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది.

27 న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ చారిత్రక సభ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. 1969 లొనే మొదటిసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభించి మధ్యలోనే ముగించారు. 2001 లో కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలిపారు కేసీఆర్.

కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనకే ప్రజలు విసిగిపోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్. స్వయంపాలన కోసం బిఆర్ఎస్ పోరాటం చేసింది. 1969 ఉద్యమాన్ని చాలామంది చూడలేదు. 2001 నుండి కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం తెలంగాణ ప్రజలకు తెలుసు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను ఒప్పించి కేసీఆర్ తెలంగాణ సాధించారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే చిదంబరం ప్రకటన వచ్చింది.

సీఎం అయ్యాక ఎవరూ ఊహించని రీతిలో కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇచ్చారు. దేశంలో అధునాతన సెక్రటేరియట్ ను, కేసీఆర్ సీఎంగా కట్టారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం,అమరవీరుల స్థూపం, జిల్లాల కలెక్టరేట్లు,ఎస్పీ ఆఫీసులు కేసీఆర్ కట్టారు.

దేశ చరిత్రలో నిలిచే విధంగా టీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుండి 50వేల మంది బహిరంగ సభకు వెళ్లబోతున్నాం. సభ తర్వాత రాజకీయ ప్రభావం ఉంటుంది. త్వరలో బిఆర్ఎస్ మెంబర్ షిప్ కార్యక్రమం, కమిటీల నియామకం ఉంటుంది.

LEAVE A RESPONSE