Suryaa.co.in

Telangana

బీఆర్‌ఎస్‌ ఖాళీ అవ్వడం ఖాయం

మంత్రి జూపల్లి కృష్ణారావు

బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అరచిగీపెట్టినా, కాంగ్రెస్‌ పార్టీపై లేని ఆరోపణలు చేస్తున్నా ఆ పార్టీ ఖాళీ ఖావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు విలేఖరుల సమావేశం నిర్వహించారు.

కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు అధికార కాంక్షతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాళీ ఖావడం ఖాయం, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గల్లంతు అవుతుందన్నారు. ఒక్క సీట్‌ కూడా గెల్సుడు గగనమే. రానున్న రోజుల్లో ఆ పార్టీ మూతపడుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఆకాల వర్షాల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిని రైతన్నలు నష్టపోయారు. రైతులు ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు గురికావద్దుని, నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు సోదరుల ఆత్మైస్థెర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్‌రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. రైతుల సంక్షేమం కోసం పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని రైతులకు భరోసా ఇచ్చారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కరువు వచ్చిన, వరదలు వచ్చిన, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న గత పదేళ్లలో ఏనాడు కూడా పంట నష్టం కింద సాయం చేయలేదు. రైతులను ఆదుకోలేదు. కనీసం పంట నష్టంపై నివేదికలు కూడా తెప్పించలేదు. రైతు భరోసా పథకం ద్వారా 3.5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే రూ. 4295 కోట్లు నగదు బదిలీ చేశాం.

69.86 లక్షల రైతులకు గాను 58.66 లక్షల మంది రైతులకు రైతు భరోసా నగదు బదిలీ చేశాం. మిగిలిన రైతులకు కూడా వారం రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో వేస్తాం. ఓ పక్కన రైతు సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటూనే మరోవైపు మూడు నెలల స్వల్ప కాలంలోనే ఆరు గ్యారంటీలను అమలు చేసింది. 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఒకటో తారీకునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయిన, అధిక వడ్డీ భారమైన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE