Suryaa.co.in

Telangana

తెలంగాణలో బౌద్ధ బిక్షులకు తగిన గౌరవం

-ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తా
-ఒక పాఠశాలను నిర్వహించాలని కోరుతున్న
-సికింద్రాబాద్ లోని మహా బుద్ధ విహార లో సీఎం రేవంత్ రెడ్డి

గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగింది. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని, 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉంది. ప్రతి పనిని ధ్యానం గా చేయాలన్న సూచన లో చాలా అర్థం ఉంది. ఈ సూక్తి ని నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాను.

ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తాను. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తాం. ఒక పాఠశాలను నిర్వహించాలని నేను కోరుతున్న. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయి.

సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉంది.బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం. బుద్దుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తి గా, ప్రభుత్వంగా చేస్తాం. ఈ ప్రభుత్వం మీది… అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. తెలంగాణలో బుద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుంది.

LEAVE A RESPONSE