Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రాను ఆ దేవుడే కాపాడాలి

– ఎంపి రఘురామకృష్ణంరాజు

ఐనవల్లి స్వయంభు శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయాలను నర్సాపురం ఎంపి, ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు కుటుంబసభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు నిలువెల్లా గాయమై, రక్తమోడిన ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబునాయుడు రూపంలో మీరే కాపాడాలని, 4న వైసీపీకి పెద్ద కర్మ పెట్టాలని ప్రార్ధించానన్నారు. తన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన కోరికను మన్నిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ‘ఎందుకంటే ఇది నా ఒక్కడి స్వార్ధం కోసం కోరిన కోరిక కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మొక్కిన మొక్కులు’ అని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE