-అఫిడవిట్లో కేసులు దాచిపెట్టావ్
-ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా
-కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్
టీడీపీ నేత బుద్దా వెంకన్న విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేశినేని నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి, చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నాడన్నారు. వెస్ట్ నియోజక వర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తామని సుజనా చెప్పారు. అర్థం చేసుకోకుండా ఈ సిగ్గులేని నాని నోటి కొచ్చినట్లు వాగుతున్నాడు. నానికి వాళ్ల అమ్మతో సహా కుటుంబసభ్యులే మద్దతు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తమ్ముడు నీకు పోటీగా నిలబడితే..చెల్లి కూడా నీ చాయలకు రాలేదని, ఎవరి ద్వారా లబ్ధి, సాయం పొందుతాడో వారినే తిట్టడం నాని నైజమన్నారు.
సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకుని తిరిగేవాడివి..ఆయన నుంచి ఎంత సాయం పొందాడో మరచిపోయాడేమో అని హితవుపలికారు. 2014లో వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చిట్స్కు డబ్బులు ఇవ్వాలి. ఐవోబీకి ముప్పై కోట్లు బజాయిలు చెల్లించాలి. 2024 అఫిడవిట్ లో కూడా ఇవే అప్పులు రాశాడు. పదేళ్లుగా వాటిని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. డబ్బులు ఎగ్గొట్టినందుకు చీటింగ్ కేసు పెట్టారు. కార్మికులను అన్యాయం చేసినందుకు కేసు పెట్టారు. ఈ కేసు విషయం అఫిడవిట్లో నాని ఎందుకు రాయలేదు. మోసం చేసిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు. కేసుల విషయం దాచిన కేశినేని నానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.