బండి సంజయ్​కి బుల్లెట్ ప్రూఫ్ కారు

కొనుగోలుకు బీజేపీ హైకమాండ్ ఓకే

హైదరాబాద్:- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి ఈ మధ్య బెదిరింపులు ఎక్కువ కావడం, ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసేందుకు పార్టీ హైకమాండ్ ఓకే చెప్పింది. రాష్ట్ర పార్టీ తరఫున 2 కోట్లతో టయోటా ఫార్చూనర్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుగోలుకు అనుమతి ఇచ్చింది.

ఇటీవల కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనకు మరింత ముప్పు పొంచిఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

ప్రస్తుతంఢిల్లీలో ఉన్నసంజయ్ బెదిరింపు కాల్స్ విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లా రు.దీంతో వెహికల్ కొనుగోలు కు ఆమోదం లభించింది.

Leave a Reply