Suryaa.co.in

Andhra Pradesh

గంజాయి యువత ప్రాణాలు తీస్తుంది

-వారిని హంతకులనూ చేస్తోంది
– విజయవాడ గంజాయి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్

గంజాయి పై ఉదాసీనత దాన్ని మన బిడ్డల వరకూ తెస్తుంది:- టీడీపీ అధినేత
ఏపీలో విచ్చలవిడి గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాదు, ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోంది. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసింది. మరో 5 గురిని హంతకులను చేసింది. దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటి?

వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకు? ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా? ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తుంది అని మర్చిపోకండి. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపండి.

LEAVE A RESPONSE