Suryaa.co.in

Andhra Pradesh

18న ఛలో అసెంబ్లీ

ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణకై 16న కలెక్టరేట్ల వద్ద నిరసన, 18న ఛలో అసెంబ్లీ
– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్
ఎయిడెడ్ విద్యాసంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తెలుగు నాడు విద్యార్ధి సంఘం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న కలెక్టరేట్ల వద్ద నిరసన, 18న ఛలో అసెంబ్లీ నిర్వహిస్తాం. ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు జారీ చేసిన జీవో నెం. 42, 50, 51లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ రద్దుతో అందులో చదువుకునే రెండున్నర లక్షల మంది పేద విద్యార్దులతో జగన్ ప్రభుత్వం చెలగాటాలాడుతుంది.
ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు, భూములను దోచుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులను రోడ్డుకీడుస్తున్నారు. ప్రశ్నించిన విద్యార్ధులపై పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారు. పోలీసులతో విద్యార్ధులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. విద్యార్ధులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని చరిత్ర చెబుతుంది. విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న జగన్ ప్రభుత్వాన్ని విద్యార్ధి లోకం క్షమించదు.
గడిచిన రెండున్నరేళ్లుగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది.
నాడు నేడు పేరుతో రూ.16వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. అమ్మ ఒడిని అందరికి ఇస్తామని సగం మంది విద్యార్ధులకు ఇచ్చి అందులోను రూ.15వేలను కాస్త రూ.14వేలకు తగ్గించారు. ఈ ఏడాది అది కూడా అమలు చేయడం లేదు. కాబట్టి టీఎన్ఎస్ఎఫ్ చేపట్టిన ఈ కార్యక్రమాలకు విద్యార్ధి సంఘాలు, విద్యార్ధుల మద్దతు, సంఘీభావం తెలియజేయవల్సింగా కోరుతున్నాం.

LEAVE A RESPONSE