Suryaa.co.in

Andhra Pradesh

శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు

-ఎన్నుకోనున్న కూటమి ఎమ్మెల్యేలు
-ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన కూటమి
-మొత్తం 175 స్థానాలకు 164 స్థానాలు గెలిచిన కూటమి
-జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
-నేడు గవర్నర్ కు లేఖ అందించనున్న కూటమి ఎమ్మెల్యేలు

విజయవాడ: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించడం తెలిసిందే. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా… కూటమి ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా 164 స్థానాల్లో జయభేరి మోగించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి.

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందుగా, జూన్ 11 చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు.

కూటమి తరఫున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో సమావేశం కానున్నారు. ఈ కీలక భేటీ ఉదయం 9.30 గంటలకు జరగనుంది. చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకున్న అనంతరం… ఎమ్మెల్యేలు ఆ మేరకు గవర్నర్ కు లేఖ అందజేయనున్నారు. ఈ లాంఛనం ముగిసిన అనంతరం, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును గవర్నర్ కోరనున్నారు.

LEAVE A RESPONSE