Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్

-ఏపీ నుంచే దేశంమొత్తానికి గంజాయి వెళుతున్నది ఓపెన్ సీక్రెట్ అని టీడీపీ హయాంలో బాబు కేబినెట్ లో చర్చించలేదా?
– స్కూల్ బస్సుల్లో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని మీ కేబినెట్ మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు చెప్పలేదా?
– గంజాయి అక్రమ రవాణాలో “పెద్దల” హస్తం ఉందని మీ కేబినెట్ మంత్రులే చెప్పింది నిజం కాదా..?
– డ్రగ్స్ రవాణాపై గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాల మీద ఆరోపణలు చేస్తే.. వాళ్ళు తోలు తీస్తారని బాబు భయం
– హైదరాబాద్ లో మీ బంధువులు డ్రగ్స్ వాడుతున్నది నిజం కాదా బాబూ..?
– ఢిల్లీలో “క్యారే.. బోషడీకే” అని బాబు మాట్లాడారా?
– ప్రధానిని బూతులు తిట్టిన వీడియోలు, అమిత్ షాపై రాళ్ళు వేసిన వీడియోలు రాష్ట్రపతికి చూపించారా బాబూ..?
– రాష్ట్రపతికి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పినందుకు బాబు అండ్ కో ను అరెస్టు చేసి అండమాన్ దీవులకు పంపాలి
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్
మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే చంద్రబాబు, తన బృందంతో ఢిల్లీ వెళ్ళారు. తనకు అధికారం దక్కలేదన్న అక్కసుతో.. అబద్ధాలు, అవాస్తవాలు పోగేసుకుని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిసి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, ఇక్కడ యువత డ్రగ్స్ కు బానిసలైపోయినట్టు ఆరోపణలు చేశాడు. ఇటువంటి కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదు. ఎన్టీఆర్‌ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లడం, అక్కడ పదిమంది నాయకులను కలిసి హడావుడి చేయడం, ఢిల్లీ పెద్దలు తనకు సహకరించేశారంటూ తన అడుగులకు మడుగులు వత్తే ఓ వర్గం మీడియాలో రాయించుకుని బిల్డప్‌లు ఇవ్వడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం తన మెడకు చుట్టుకున్నప్పుడు కూడా చంద్రబాబు హస్తినకు వెళ్లారు, ఆ కేసునుంచి బయట పడేందుకు ఆఖరికి ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు.
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తన పార్టీ నాయకుడితో బోషడికే అని తిట్టించి… దాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా .. ? అని మేము అడుగుతున్నాం. ఆరుకోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అయిన ముఖ్యమంత్రిగారిని తన చెంచా మనుషులతో తిట్టించడమే చంద్రబాబు 40 ఇయర్స్‌ పొలిటికల్ ఇండస్ట్రీ అనుభవమా?. తన నలబైయేళ్ల రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేయించి, బూతులు తిట్టించకూడదనే ఇంగిత జ్ఞానం కూడా బాబుకు లేదా అని అడుగుతున్నాం. అసలు చంద్రబాబు 36 గంటల పాటు ఎందుకోసం దీక్ష చేశారో ఇప్పటివరకూ చెప్పలేదు. ఆ దీక్షలో అయినా తమ పార్టీ నాయకులు ఆవేశంలో తప్పుగా మాట్లాడారని, ఆ పదాన్ని ఖడిస్తున్నామని చంద్రబాబు ఒక మాట మాట్లాడి ఉంటే ప్రజలు కూడా హర్షించేవాళ్లు. కానీ బాబు అలా చేయలేదు. దీక్ష పేరుతో కూర్చుని, తమ పార్టీ నేతలతో మరింతగా తిట్టించాడు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుతో పాటు మహిళా రాజ్యం అమలు అవుతోంది. బడుగు, బలహీన, పేద, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి అన్నింటా అగ్ర తాంబూలం వేస్తున్నారు. 75ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో.. ఎన్నడూ, ఎక్కడా చూడని సంక్షేమ రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతోంది. బడుగు, బలహీనవర్గాలు, మహిళలకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేక కడుపు మంటతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు తన దగ్గర ఉన్న రాజకీయ అస్త్రాలు అన్ని వాడేశారు. చివరకు ఆయన దగ్గర మిగలినవి కేవలం తిట్లు మాత్రమే. తిట్లతో పాటు ఒక అడుగు ముందుకు వేసి బూతులు మాట్లాడించడం. ఓవైపు ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తూనే, మరోవైపు ‘స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం’ అంటూ రాష్ట్రానికి కొత్త పేరు పెడుతున్నారు. అసలు చంద్రబాబు తాను ఏం చేస్తున్నారో ఆయనకు అయినా అర్థం అవుతుందా?
రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేక… ఆర్టికల్‌ 356 అమలు చేయాలంటూ డిమాండ్‌ చేయడం హాస్యాస్పదం. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్‌ చేయడం వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకు వచ్చి పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.
రాష్ట్రపతిని కలిసిన తర్వాత… ఆయన తమను సమర్థించారంటూ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారు. చంద్రబాబు ఏంటో, ఆయన కుట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో.. నిక్కరు వేసుకునే చిన్నకుర్రాడి దగ్గర నుంచి అందరకి కూడా తెలుసుకాబట్టి, ఇటువంటి చీప్ ట్రిక్స్ ను ఎవరూ నమ్మరు.
మరి ఇన్ని నీతులు చెబుతున్న బాబు.. సభ్యసమాజం సిగ్గుపడేలా ముఖ్యమంత్రిని దుషించిన వీడియోను మరి రాష్ట్రపతిగారికి చూపించారా?
టీడీపీ సీనియర్ నేత అయ‍్యన్నపాత్రుడు … చెత్త నా కొడుకులు అని తిడతాడు. సభ్యత ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనా అవి? ఇలాంటి పనికిమాలిన వాళ్ళకు నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎలా చేశారా అని ఆశ్చర్యం వేస్తోంది.
ముఖ్యమంత్రిని దారుణంగా దూషిస్తే… తమ పార్టీ నేత మాట్లాడింది తప్పు, ఖండిస్తున్నాని చంద్రబాబు హుందాగా రాజకీయాలు చేయగలిగారా? అంతేకాకుండా బోషడీకే అన్న మాటలను సమర్థిస్తూ చంద్రబాబు దీక్ష చేస్తున్న సందర్భంగా బోండా ఉమా తదితర టీడీపీ నేతలు మళ్లీ అదే విధంగా వ్యవహరించారు. ఇది ప్రజాస్వామ్యమా? టెర్రరిజాన్ని స్పాన్సర్డ్‌ చేసే విధంగా మాట్లాడేది మీ పార్టీ నేతలే కదా.. పక్క నుండి ప్రోత్సహిస్తున్నది మీరే కదా చంద్రబాబూ..
అసాంఘిక శక్తులకు రారాజుగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడే. బాబు చిటికె వేస్తే తాడేపల్లి మొత్తం ఎక్కడకో వెళ్లిపోతుందని బోండా ఉమా మాట్లాడాడు. ఆవలించినప్పుడు చిటికె వేసుకోవడానికి పనికి వస్తుందే తప్ప, అంతకు మించి మీ చిటెకలు మరెందుకూ పనికిరావు.
బోషడికే అంటే బాగున్నారా? అని అర్థం అంటున్నారు కదా? మరి ఢిల్లీలో వెళ్లిన మీరు అక్కడ పెద్దలను ‘క్యారే బోషడికే’ అని పిలుస్తున్నారా? ప్రజలంతా అసహ్యించుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రిని మీరు, మీ నాయకులు బూతులు తిట్టిన సీడీలను, అమిత్‌ షా గారు తిరుపతి వచ్చినప్పుడు రాళ్లు రువ్వించిన వీడియోలను రాష్ట్రపతికి చూపించారా?
వాస్తవాలను కప్పిపుచ్చి ఏదోరకంగా ముఖ్యమంత్రిని తిడితే… అందుకు ప్రజలు స్పందిస్తే.. దాన్ని అల్లర్లు క్రింద సృష్టించాలని చూస్తున్నారు. గతంలో కూడా మత, కుల రాజకీయాలు చేసి, రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూశారు. తాజాగా ఇప్పుడు డ్రగ్స్‌ రాజకీయాలు తీసుకువస్తూ అందులో బూతు రాజకీయాలు యాడ్‌ చేస్తున్నారు.
పట్టాభి, బోండా ఉమ మాట్లాడిన వీడియోలను మరోసారి మీడియా ముందు ప్రదర్శించిన ఎంపీ భరత్
ఒకప్పుడు అభివృద్దిలో నెంబర్‌ వన్‌గా ఆంధ్రప్రదేశ్ ఉందని ఢిల్లీలో మీడియా మైకులు ముందు చెప్పిన చంద్రబాబు.. టీడీపీ హయాంలో గంజాయిలో కూడా నెంబరు వన్ గా ఉందని ఎందుకు చెప్పలేకపోయారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ప్రాంతానికి చెందిన మీ మంత్రివర్గంలో పనిచేసిన గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు గంజాయి సాగుపై ఏం మాట్లాడారో మీకు గుర్తు లేదా అని ప్రశ్నిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు.
ఏపీ నుంచే దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా అవుతుందని.. అది ఓపెన్ సీక్రెట్ అని, ఆ క్రెడిట్ అంతా మీ ప్రభుత్వానికే దక్కుతుందని కేబినెట్ మీటింగులో చంద్రబాబు చర్చించారని, అప్పుడు మీ కేబినెట్ సహచరుడుగా ఉన్న గంటా శ్రీనివాసరావు మీడియా ముందు చెప్పింది నిజం కాదా.. అని ఆ వీడియోలను కూడా ప్రదర్శించారు.
ఆఖరికి స్కూల్‌ బస్సుల్లోనే గంజాయిని తరలించేవారని గంటా శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించారే? మరి అప్పుడేం చేశారు చంద్రబాబూ? గంజాయి స్మగ్లింగ్‌లో మీ పెద్దల హస్తంతోపాటు మీ అందరి పాత్ర ఉందంటూ అయ్యన్నపాత్రుడు ఒప్పుకున్నారు కదా?
గంజాయి సాగు గురించి, మీ హయాంలో పెద్దల హస్తం గురించి మీ కేబినెట్ మంత్రులే అంగీకరించి.. ఈరోజు మా ప్రభుత్వంపై నెపం వేయడానికి సిగ్గు లేదా..? ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాలని కోరుతున్నాం.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎప్పటి నుంచో ఏవోబీ( ఆంధ్రా-ఒడిశా బార్డర్)లో సాగు అవుతున్న గంజాయి పంటను కూకటివేళ్లతో పెకిలిస్తున్నందువల్లే, పెద్ద ఎత్తున పట్టుకుంటున్నందువల్లే.. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇక గుజరాత్‌లో ముంద్రా పోర్టులో హెరాయిన్‌ పట్టుకుంటే.. దానికి మూలాలు విజయవాడలో ఉన్నాయంటూ పనిగట్టుకుని రాష్ట్రం మీద టీడీపీ బురద చల్లుతోంది. మరి గుజరాత్‌ పోర్టులో హెరాయిన్‌ దొరికింది కదా? గుజరాత్‌ ప్రభుత్వంపై ఎందుకు ఆరోపణలు చేయడం లేదు బాబూ? అలా ఆరోపణలు చేస్తే బీజేపీ వాళ్లు తోలు వలిచేస్తారని మీకు తెలుసు. అందుకే వాళ్ల జోలికి వెళ్లరు, మాట్లాడరు.
అలానే, ముంబయిలో డ్రగ్స్‌ కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయని వార్తలు వస్తున్నాయి కదా? మరి వాటి గురించి ఎందుకు నోరు మెదపరు చంద్రబాబు? దానిగురించి మాట్లాడితే, అక్కడ అధికారంలో ఉన్న శివసేన వాళ్లు నడుము విరిచేస్తారని తెలుసు కాబట్టే ఏమీ మాట్లాడరు.
ఇవాళ హైదరాబాద్‌లో తమరి బంధువులు డ్రగ్స్‌ వాడుతున్నారని సోషల్‌ మీడియాలో బహిరంగంగా చెప్పుకుంటున్న మాట వాస్తవం కాదా? మరి ఇన్ని ఆరోపణలు వచ్చాయి కదా? తెలంగాణ సీఎం కేసీఆర్‌గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, ఓటుకు కోట్లు కేసు తిరిగితోడతారేమో అన్నది చంద్రబాబు భయం.
ఆంధ్ర రాష్ట్రంలోని యువత అంతా డ్రగ్స్‌కు ఎడిక్ట్‌ అయిపోయారంటూ.. అబద్ధాలు, అవాస్తవాలను ఢిల్లీలో ప్రచారం చేయడం వల్ల మీరు సాధించేదేమిటి చంద్రబాబూ..? రాష్ట్రంలో ఉన్న యువతపై డ్రగ్స్‌ ఎడిక్ట్‌ అంటూ ముద్ర వేయడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి హస్తినకు వెళ్లారా?
చంద్రబాబుకు పదవి, అధికారం లేకపోతే రాష్ట్రం పరువును ఈ రకంగా తీస్తారా? రాష్ట్రంలో ప్రజలంతా బాబు వైఖరిని గమనించాల్సిన అవసరం ఉంది.
చివరకు దేవుళ్లను కూడా వదలకుండా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ఏపీలో ఏం జరిగిపోతుందని రాష్ట్రపతి పాలన పెట్టాలని అడగడానికి వెళ్లారు?
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని చంద్రబాబు ఏదో రకంగా వ్యవస్థలను మేనేజ్‌ చేయాలని చూడటమే పని. ఇంత దారుణమైన, నీచ రాజకీయాలు చేస్తూ 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు యువత సిగ్గుపడాలి.
దేశానికి ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి చంద్రబాబు అబద్ధాలు, అసత్యాలు చెబుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రపతికి మేం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు అవాస్తవాలు, అబద్ధాలు చెబుతూ.. స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం అనే నెపాన్ని వేస్తున్న చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ బృందాన్ని తక్షణమే అరెస్ట్‌ చేసి, అండమాన్‌ దీవుల్లాంటి చోటికి పంపిస్తే ప్రజలు హర్షిస్తారు.

LEAVE A RESPONSE