రాష్ట్ర ఎన్నికల కమీషనర్,డిజిపి గౌతం సవాంగ్ లకు చంద్రబాబు లేఖ

ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయి.అధికార వైసీపీతో అధికారులు కుమ్మక్కై టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయనీకుండా అడ్డుకుంటున్నారు.స్థానిక ఎన్నికల అధికారులు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారు.నకిలీ సంతకాలతో నామినేషన్లను తొలగించారు.అధికార వైసీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారు. టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకునేందుకు తప్పుడు ఫిర్యాదులతో అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు.
9 నవంబర్ 2021 అర్ధరాత్రి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అమరనాథ్ రెడ్డితో సహా తిరుపతి పార్లమెంటరీ టీడీపీ ఇంచార్జి పుల్లివర్తి నాని లను అరెస్ట్ చేశారు.నవంబర్ 8, 2021న తప్పుడు కేసు నమోదు చేసి 9వ తేదిన అర్థరాత్రి అరెస్టు చేశారు.పోలీసులకు అందుబాటులో ఉండగా అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? ఇది టీడీపీ నేతలను ఎన్నికల్లో ప్రచారం చేయనీకుండా అడ్డుకునేందుకు అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నం తప్పా మరొకటి కాదు.
జరుగుతున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.బ్రిటీష్ రాజ్, నియంతృత్వ అధికారాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

Leave a Reply