ఉనికి కోసమే ముద్రగడ ఉత్తుత్తి లేఖలతో కాలక్షేపం చేస్తున్నాడు

-జగన్మోహన్ రెడ్డి కాపుజాతికి ఏమీ చేయనన్నాక కూడా, పద్మనాభం తనముసుగు తీయకపోతే ఎలా?
-టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప

తన ఉనికిని కాపాడుకోవడానికే ముద్రగడ పద్మనాభం కాపుల పక్షాన మాట్లాడుతున్నానంటూ, సందర్భానుసారం ఉత్తుత్తి లేఖలు వదులుతుంటాడని… కాపులకు న్యాయం చేస్తాను, వారిని ఉద్ధరిస్తానని నమ్మించిన వ్యక్తి, చివరకు వారిని కేసుల్లో ఇరికించి, జగన్ భయంతో ఇంట్లో దాక్కున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు క్లుప్తంగా …!
చంద్రబాబునాయుడు కాపులకుచేసిన మేలేంటో ఆవర్గానికి బాగాతెలుసు. ఉమ్మడిరాష్ట్రంలో గానీ, విభజనానంతర ఏపీలోగానీ ఏముఖ్యమంత్రి కాపులకు చేయనిమంచిని, చంద్రబాబు నాయుడు చేశాడనేది నవ్యాంధ్రఎరిగినసత్యం. కాపులకు 5శాతం రిజర్వేషన్లతోపాటు, కాపుకార్పొరేషన్, కాపుయువతకు విదేశీవిద్య సహా, ఆవర్గంలోని చిన్నాపెద్దా ముసలీముతకా అందరికీ న్యాయంచేసేలా కార్యక్రమాలు అమలుచేశాడు. కాపులకు మేలుచేస్తున్నవ్యక్తిని అడుగడుగునా ముద్రగడ అడ్డుకున్నాడు. ముద్రగడకు రాష్ట్రంలోని పరిస్థితులు, ఈప్రభుత్వదుర్మార్గాలు అర్థంకావడంలేదా? జగన్మోహన్ రెడ్డి కాపుజాతికి ఏమీచేయనని తెగేసిచెప్పాక కూడా పద్మనాభం తనముసుగు తీయకపోతేఎలా? చంద్రబాబు నాయుడి ప్రతిజ్ఞ నెరవేరదని చెప్పడానికి ముద్రగడ ఎవరు? చంద్రబాబునాయుడి ప్రతిజ్జ నెరవేర్చేవరకు మేమంతా ఆయనవెంటే ఉండి, దుర్మార్గపు ప్రభుతాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం. ముద్రగడ ఇంట్లోకూర్చొనిలేఖలు రాయకుండా, బయటకొచ్చి కాపులకు నష్టం జరక్కుండా, వారిఆత్మాభిమానాన్ని ఈ ప్రభుత్వం హరించకుండా చూడాలని సూచిస్తున్నా.

Leave a Reply