రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?

-ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే తప్పుకోండి!
-అధికారపార్టీ వారినే చైర్మన్ గా నియమించుకోండి, ఎన్నిక ఎందుకు?
-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు
కొండపల్లిలో విధ్వంసం సృష్టించి వరుసగా రెండోరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడాన్ని చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజిపిలు విధులు నిర్వర్తించడం చేతగాకపోతే తమ పదవులనుంచి తప్పుకోవాలి. ఎంపితో కలిపి తెలుగుదేశం పార్టీకి 16మంది సభ్యుల బలం ఉంది, చైర్మన్ స్థానాన్ని గెల్చుకోవడానికి అవసరమైన బలం టిడిపికి ఉండగా విధ్వంసం సృష్టించి రెండుసార్లు ఎన్నిక వాయిదా వేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అడ్డుకునే బదులు అధికారపార్టీకి చెందిన వారినే చైర్మన్ గా నియమించుకోండి. తెలుగుదేశం పార్టీ సభ్యులను భయపెట్టి బలవంతంగా తమవైపు తిప్పకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, మారణాయుధాలతో ఎన్నికతో సంబంధం లేని వైసిపి నేతలు కొండపల్లిలో గందరగోళం సృష్టిస్తున్నా పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారు, ఎన్నిక జరగకుండా చేసేందుకు వైసిపి నేతలు ఎంత విధ్వంసం సృష్టించినా టిడిపి సభ్యులు అత్యంత క్రమశిక్షణతో, ఓర్పుతో వ్యవహరిస్తున్నారు. మా సహనాన్ని చేతగానితనంగా పరిగణించవద్దు, చట్టప్రకారం ప్రజాస్వామ్య బద్ధంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎన్నిక నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్జప్తి చేస్తున్నాం.

Leave a Reply