Suryaa.co.in

Telangana

ఓటు వేసిన చిరంజీవి

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో కుటుంబసభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓటు వేశారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరి వల్ల రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు మీ బాధ్యత, మీ హక్కు అని ఓటర్లకు పిలుపునిచ్చారు.

మరోవైపు నానక్‌రామ్‌గూడాలో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నరేష్ ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వీరితో పాటు ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఓటు వేశారు.

ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్

అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఉదయాన్ని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లితో కలిసి వెళ్లి ఓటు వేశారు. క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సైతం ఉదయాన్నే తన ఓటు వేశారు. హైదరాబాద్ సిటీలో తనకు కేటాయించిన పోలింగ్ బూత్ వదద్ క్యూలైన్‌లో నిలబడి తనవంతు వచ్చాక ఓటు వినియోగించుకున్నారు.

 

LEAVE A RESPONSE