Suryaa.co.in

Andhra Pradesh

క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమావేశం

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం
తమ సమస్యలను ముఖ్యమంత్రికి నివేదించిన బిషప్‌లు, రెవరెండ్‌లు ఇతర క్రైస్తవ సంఘాల ప్రతినిధులు
ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చర్చెస్‌ తరపున హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు
చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు
ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి… స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేసిన క్రైస్తవ సంఘాలు

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే…:
క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎం. చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చిన సీఎం.
జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి సీఎం హామీ. ఎస్పీ, కలెక్టర్‌లు జిల్లా స్ధాయిలో సమస్యల పరిష్కరిస్తారన్న సీఎం.
ఇకపై క్రిస్టియన్‌ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామన్న సీఎం. తద్వారావారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందన్న సీఎం. క్రిస్టియన్లకు స్మశానవాటికలు ఏర్పాటుపైనా సానుకూలంగా స్పందించిన సీఎం.

LEAVE A RESPONSE