జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి: రఘురామ

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోసిడీకే పదానికి వైసీపీ అధికార వెబ్‌సైట్‌లో కొత్త పదాన్ని సృష్టించారని విమర్శించారు. ‘‘మలినంతో కూడిన మనసులు మీవి. బీపీలు పెరిగితే దాడులు చేస్తారని సీఎం మాట్లాడడమేంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జగన్‌ ఇలా మాట్లాడతారా?. వైసీపీ నేతలు బూతులు మాట్లాడడం లేదా?. గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు జగన్‌కు గుర్తుకున్నాయా?. వైసీపీ నేతలు ఇకనైనా మారాలి. సీఎం జగన్‌ ఉద్రేకాలు, వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శాంతిభద్రతలకు ఎవరు నష్టం కలిగించినా రాజద్రోహం కేసు పెడతారు. మిమ్మల్ని అనని మాటలకే మీ అభిమానులకు బీపీలు పెరిగిపోతే.. కోడికత్తి దాడి జరిగినప్పుడు మీ అభిమానులు ఏమయ్యారు?. కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు మారేందుకు ప్రయత్నించాలి’’ అని రఘురామ సూచించారు.

Leave a Reply