తెలంగాణ ఉద్యోగుల బదిలీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

– తరువాయు వంతు కేసీఆర్ దే
-ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు జగన్ తీపి కబురు
-ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం

ఏపీలో గత నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు, సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. వారిని తెలంగాణకు వెళ్లేందుకు అనుమతించారు. దీనితో కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ఉద్యోగుల పోరాటం ఫలించింది. ఇక వాటిని ఆమోదించాల్సిన బాధ్యత, తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఉంది.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి బదిలీ కోరుతున్న ఉద్యోగుల వివరాలు సేకరించాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు 1338 మంది ఉద్యోగులు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలతో జిఏడి రాష్ట్ర పునర్విభజన శాఖ వారు ప్రతిపాదన రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపడం జరిగింది. ఈ రోజు  ముఖ్యమంత్రి ఉద్యోగులు ఇరు రాష్ట్రాల మధ్య బదిలీల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

తదుపరి ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తే అప్పుడు బదిలీలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి బదిలీల ప్రక్రియ చేపడుతారు. అలాగే తెలంగాణకు బదిలీ కోరుకునే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇపుడు NOC ఇస్తుంది.

అలాగే త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీలలో తప్పనిసరి బదిలీకి ఎనిమిది సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. దీనికి  ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

అంతర్రాష్ట్ర బదిలీలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Leave a Reply