Suryaa.co.in

Telangana

ఏపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ఏజెంట్లు

-బిఆర్ఎస్ పోరాటంతోనే కృష్ణా జలాలపై కాంగ్రెస్ తీర్మానం
-కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య
-కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం ఉంది
-కాంగ్రెస్ నేతల చేతకానితనం వల్లే కృష్ణా జలాలపై హక్కుని కోల్పోయాం
-జలాల విషయంలో కేంద్రంపై పోరాడాల్సింది పోయి మా పై ఎదురు దాడి చేయడం దురదృష్టకరం
-సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదు?
-కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది
-రేపటి సభ కు ఉమ్మడి నల్గొండ ,ఖమ్మం,మహబూభ్ నగర్ జిల్లాల నుండి ప్రజలు భారీగా హాజరవుతారు
– మాజీ మంత్రి ,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనం వల్లే,కృష్ణా నది ప్రాజెక్టుల హక్కులను కోల్పోయామని మాజీ మంత్రి ,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది పై అన్న ప్రాజెక్టుల సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు రేపు నల్లగొండ లో బిఆర్ఎస్ తలపెట్టిన ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభ స్థలి ని మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గాధరి కిషోర్ కుమార్, జీవన్ రెడ్డి, రవీంద్ర కుమార్ , చిరుమర్తి లింగయ్య తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో కలసి జగదీష్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్బంగా. మాట్లాడిన ఆయన.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుండి ప్రజలు భారీగా హాజరవుతారని అన్నారు. కేసీఆర్ సభ కొసం క్రిష్ణా పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు ఆత్రుత గా ఎదురు చూస్తున్నారని అన్నారు. సభ కు లక్షలాది గా తరలిరావడం కోసం స్వచ్చందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని అన్నారు .

కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదనీ ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడానికి ఏపీ వస్తే మేమే తరిమామని అన్నారు.కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య గా అభివర్ణించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాల్లు కృష్ణానదీ ప్రాజెక్టులు మా కంట్రోల్ లోనే ఉన్నాయనీ పేర్కొన్నారు. కృష్ణా జాలల హక్కులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడాన్ని ఏపి ప్రభుత్వం ఒప్పుకున్నా… అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకోలేదన్నారు.కాంగ్రెస్ నేతలు ఏపి నేతలకు ఏజెంట్ లు గా మారారని ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులుగా మారారని పేర్కొన్నారు.కృష్ణ జలాల హక్కు విషయంలో కేంద్రం పై పోరాడాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు మాపై ఎదురుదాడి చేయడం దురదృష్టకరం అన్నారు.

కృష్ణా జలాల హక్కులపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందని అన్నారు.కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది అన్నారు

LEAVE A RESPONSE