– మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు
– గత వారం కేరళలో 69 కొత్త కరోనా కేసులు
– మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు
– మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కరోనా యాక్టివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి. అయితే దేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
హాంకాంగ్, సింగపూర్లో కరోనా కేసులు పెరుగడం భారత్పై ప్రభావం చూపుతున్నదని చెప్పారు.
కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూశాయి. గత వారం కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనాతో ఇద్దరు మరణించినట్లు తెలుస్తున్నది. అయితే అవి కరోనా మరణాలు కాదని డాక్టర్లు తెలిపారు.
చనిపోయిన ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. అయితే ఇతర అనారోగ్య కారణాలతో వారు మరణించినట్లు వివరించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.