బీజేపీ నేత జూపూడి రంగరాజు ఇంటికి దత్తాత్రేయ

జూపూడి రంగరాజు మాతృమూర్తి హైమావతిని పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గుంటూరు పర్యటన సందర్భంగా రైలుపేటలోని జూపూడి రంగరాజు నివాసానికి వచ్చారు.ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ జూపూడి రంగరాజు కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని జ్ఞాపకంచేసుకున్నారు.

దత్తాత్రేయ ఏమన్నారంటే.. కొన్ని సామాజిక సమస్యలను మనం అధిగమించాలి.యువత మత్తుపానీయాలకు బానిస అవుతున్నారు.తెలుగు రాష్ట్రాలు మత్తుపదార్ధాలను పూర్తిగా నిషేధించాలి.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మత్తు పదార్థాలు నిషేధించడాన్ని దృష్టి పెట్టాలి. తెలుగు రాష్ట్రాలు సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలి.కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం కి ప్రోత్సాహకాలు ఇస్తుంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కుటుంబసభ్యులు జూపూడి యజ్ఞ దత్తు, వనమా పూర్ణచంద్రరావు, మాజేటి ముత్యాలు, హిందుకాలేజ్ ఆఫ్ ఫార్మసీ పాలక మండలి సభ్యులు మరియు సిబ్బంది బిజెపి నాయకులు కార్యకర్తలు కలిశారు.

Leave a Reply