సబ్బండ ప్రజలకు కొండంత అండ!
తెలంగాణలో కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగం
రాష్ట్రంలో కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం
: తెలంగాణ రాష్ట్రంలో… సంక్షేమంలో సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేవు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ.
మేనిఫెస్టో భారతావని కే తలమానికంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం అని తేలిపోయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అద్భుతంగా ప్రజల శ్రేయేస్సు కోరే విధంగా వుంది అన్నారు. అలాగే ప్రజలకు కొండంత అండ గా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉందని చెప్పారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న పలు పథకాల పరిధిని పెంచేలా, లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా పలు అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చడం పట్ల సంతోషంగా ఉందన్నారు.
తాజా మ్యానిఫెస్టోలో అన్ని అంశాలను అమలు చేస్తామని సీఎం కెసిఆర్ ఘంటాపథంగా చెప్పడం మంచి విషయం అన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ళ పాలనలో చేపట్టిన పథకాలకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయన్నారు. ప్రజలంతా మరోసారి ఆలోచించి ఓటేసి మూడవసారి కూడా బీఆర్ఎస్ను ఆశీర్వదించి, సీఎం కెసిఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.