డీజీపీ గారూ.. లోకేష్‌ పాదయాత్రకు రక్షణ కల్పించండి

– భగ్నం చేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి చెబుతున్నాడు
– ఎమ్మెల్యే పై చర్య తీసుకోండి
• నారా లోకేశ్ పాదయాత్ర సజావుగా సాగేటట్లు రక్షణ ఏర్పాట్లు చేయమని డీ.జీ.పీ కి లేఖ రాసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
• 66 రోజులుగా వేలాదిమంది అభిమానులతో సాగుతున్న లోకేశ్ పాదయాత్రను విచ్చిన్నం చేయాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని లేఖలో ప్రస్తావించిన వర్ల

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేస్తున్న పాదయాత్రను భగ్నం చేసేందుకు, అధికార పార్టీ ప్రయత్నిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఆ మేరకు పాదయాత్రకు తగిన రక్షణ కల్పించాలని ఆయన డీజీపీకి లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..

అనంతపురం జిల్లాలో ఉవ్వెత్తున సాగుతున్న పాదయాత్ర చూసి కొంతమంది వైసీపీ పెద్దలకు కన్ను కుట్టింది. తన సామ్రాజ్యంలో అడుగుపెడితే పాదయాత్రను భగ్నం చేస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బీరాలు పలుకుతున్నారు.అరాచకం, దౌర్జన్యాలకు పేరుగాంచిన పెద్దిరెడ్డి పాదయాత్రను భగ్నం చేస్తానని బీరాలు పలకటం క్షంతవ్యం కాదు.

డీజీపీ వెంటనే తాడిపత్రి ఎమ్మెల్యేపై చట్యపరమైన చర్యలు తీసుకొని నారా లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలు లేకుండా తగిన రక్షణ చర్యలు చేయాలని కోరిన వర్ల రామయ్య.తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఎట్టిపరిస్ధితుల్లోనూ నారా లోకేశ్ పాదయాత్రను తాడిపత్రిలో జరగనివ్వనని ఎమ్మెల్యేకు హామీ ఇవ్వటం పోలీస్ అధికారిగా దుర్మార్గపు చర్య – తగని పని. పాదయాత్రకు ఏ ఆటంకం జరిగినా ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు శాఖ పూర్తి బాధ్యత వహించాలి.

Leave a Reply