మహిళల్ని కించపరిచి..జగన్ రెడ్డి పైశాచికత్వం

– అలిపిరి బాంబు దాడిలో కూడా కన్నీరు పెట్టలేదు
– ఉత్తమ ఇల్లాలిపై నిందలకు గుండె చెరువైంది
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి
నేను చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాలుగా దగ్గర నుండి చూస్తున్నా. అలిపిరిలో క్లెమోర్ మైన్స్ పేలుళ్లలో తీవ్రక్షతగాత్రుడైనప్పుడు దగ్గరగా చూశాను. రక్తమోడుతున్నా గానీ కంట నీరు పెట్టలేదు. చంద్రగిరిలో శాసనసభ్యునిగా ఓడిపోయినా కంట నీరు పెట్టలేదు. 2012లో జరిగిన ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయినప్పుడూ కంటతడి పెట్టలేదు. నిండు శాసన సభలో ఉత్తమ ఇల్లాలి వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంటే తట్టుకోలేక గుండె చెరువై కన్నీరు కట్టలు తెంచుకుని బయటకొచ్చాయి. గొంతు గద్గధలాడింది.
అభినవ దుశ్శాసనుల్ని మందలించి సభకు క్షమాపణ చెప్పి ఉంటే జగన్ రెడ్డిని మహిళా లోకం క్షమించి ఉండేది. అందుకు భిన్నంగా సభలో పైశాచికానందం వ్యక్తం చేస్తూ వికారపు నవ్వు నవ్వారు. కనీసం విచారం వ్యక్తం చేయకుండా తన వంది మాగదుల ద్వారా ఎదురు దాడి చేయిస్తున్నారు. తన తల్లిని చెల్లిని ఏ తెలుగు దేశం కార్యకర్తా ఏనాడూ అసెంబ్లీలో ఇలా వ్యక్తిత్వ హననం చేయలేదు.
ఇందుకు అసెంబ్లీ రికార్డులు, గ్యాలరీలో ఉన్న మీడియానే సాక్ష్యం. భారత స్త్రీపై నిందలు వేసిన వారు, చెరబట్టిన వారు చరిత్ర కాలగర్భంలో హీనులుగా నిలిచిపోయారు. జగన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో 530 మంది మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయి. మహిళలపై వేధింపుల్లో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో ఉండడమే అందుకు నిదర్శనం. పార్టీలకు, కులాలకు అతీతంగా నారీ లోకమంతా వైసీపీ వ్యవహార శైలిని ఖండిస్తోంది. నిరసిస్తోంది. వారందరికీ ధన్యవాదాలు

Leave a Reply