భగవద్గీతను కించపరిస్తే అడ్డుకుంటాం

  • హిందూ వ్యతిరేక జెండాలను బొందపెడతాం
  • ఇమామ్ లకు ఇచ్చే గౌరవం అర్చకులకు ఇవ్వరా?
  • అర్చకులు అడ్డాకూలీ వద్ద అడుక్కునే దుస్థితికి వచ్చినా స్పందించరా?
  • అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించిన మగాడు మోడీ
  • అధికారంలోకొస్తే పేద బ్రాహ్మణులను ఆదుకుంటాం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

భగవద్గీతను కించపరిస్తే తగిన శాస్తి చేస్తామని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. వైకుంఠ ధామాల రథాలకు భగవద్గీత పెడితే అడ్డుకుంటామని అన్నారు. రాష్ట్రంలో హిందువుల ఓటు బ్యాంకును ఏకం చేయడం ద్వారా హిందూ వ్యతిరేక జెండాలను బొందపెడతామని స్పష్టం చేశారు. ఈ రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద బ్రాహ్మణ ప్రతినిధులు బండి సంజయ్ వద్దకు వచ్చి ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు.

బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై హిందూ మతంపై జరుగుతున్న దాడులను బ్రాహ్మణులు ప్రస్తావించారు. పేరుకు అగ్రకులమైనా… బ్రాహ్మణులలో కడు బీదలు ఉన్నారు. కనీసం రూ.1000 కోట్లతో “బ్రాహ్మణ కార్పొరేషన్” ఏర్పాటు చేయాలని కోరారు. కుల, మతాలకు అతీతంగా ఉచిత విద్య, వైద్యం తప్పనిసరిగా అందించాలని, చట్టసభల్లో కనీసం రెండు ఎంపీ, 4 ఎమ్మెల్యే స్థానాల్లో బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని, దూప, దీప, నైవేద్యం కింద ఇస్తున్న ఇస్తున్న నిధులను పెంచాలని, అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పే స్కేలు అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడిన మాటల్లోని ముఖ్యాంశాలు…

పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకునే పాదయాత్ర ప్రారంభించాను. మాకు కష్టాలు వస్తే మీకే చెప్పుకుంటాం… కానీ మీకే కష్టాలు వచ్చి మాకు చెప్పుకునే పరిస్థితి రావడం చాలా బాధాకరం.

రాను రాను కంప్యూటర్ లు పెట్టుకుని పూజలు చేసుకునే పరిస్థితి వస్తుందేమో. వేద పాఠశాలలు ప్రతి జిల్లాలో ఉండాలి.. వాటికోసం నా వంతు సాయం చేస్తా. రాష్ట్రంలో ఒక పెద్ద వేద పాఠశాలల ఉండాలి. దానికింద బ్రాంచీలుగా ప్రతి జిల్లాకు ఒక వేదపాఠశాల ఉండాలి.

చిక్కడపల్లి చౌరస్తాలో బ్రాహ్మణులు అడుక్కునే పరిస్థితిని చూస్తున్నాం. అడ్డా మీద బ్రాహ్మణులు అడుక్కు నే పరిస్థితి ఉంది. ప్రస్తుతం హారతి, అగరొత్తులలో ఉండే కెమికల్ వలన అర్చకుల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత మోడీదే. అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించిన మగాడు మోడీ. తెలంగాణలో బ్రాహ్మణుల కు రక్షణ లేకుండా పోయింది.

కొంతమంది “రామాయణం, భగవత్గీత” లను కూడా కించపరుస్తున్నారు. వైకుంఠ రధాలకు భగవత్గీత పెడుతున్నారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే… ఇలా చేస్తున్నారు. అలాంటి వారిని అడ్డుకుని తీరుతాం. భగవద్గీతను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదు.

బీజేపీ అంటేనే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే పార్టీ. తెలంగాణ ధనిక రాష్ట్రమని అంటున్న కేసీఆర్.. అర్చకులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? అర్చకులు పస్తులున్నా… దేవుళ్ళకు నైవేద్యం పెడతారు. అర్చకులకు రూ.6 వేలు ఇవ్వడానికే కేసీఆర్ కు దిక్కు లేదా? ‘ఇమామ్’ లకు ఇచ్చే గౌరవం కూడా ‘అర్చకులకు’ ఇవ్వరా?

మసీద్ లకు వెంటనే అనుమతులు ఇస్తారు… గుడులు కట్టాలంటే మాత్రం ఇవ్వరు. వినాయక చవితికి ఎన్నో అనుమతులు తీసుకోవాలి. రంజాన్ కు మాత్రం ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. ప్రతి పురాతన దేవాలయాన్ని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇతర మతాలను గౌరవించినట్టే హిందువులను గౌరవించాలి. దేవాదాయశాఖ నిధులను దారి మళ్లిస్తున్నారు. భయపడేవాళ్ళు బ్రాహ్మణులు కారు. పార్టీలు, పాలకులు… చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు బీజేపీ అండగా ఉంటుంది.

రాష్ట్రంలో హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బరాబర్ ఓటు బ్యాంకుగా మారుస్తాం. హిందూ వ్యతిరేక జెండాలను పక్కా బొందపెడతాం. వరంగల్ లో పూజారిని హత్య చేస్తే… ఈ ప్రభుత్వం ఏం చేసింది? హెల్త్ కార్డ్స్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో మీకు అండగా ఉంటాం. పక్కా బీజేపీ అధికారంలోకి వస్తుంది. గెలిచే అవకాశాలున్న స్థానాల్లో బ్రాహ్మణులకు టికెట్స్ ఇస్తాం. మీరు ప్రజల్లో ఉండండి… తిరగండి.. కులాల ప్రాతిపదికన టికెట్స్ కాదు… గెలిచే అభ్యర్థులకే టికెట్స్ ఇస్తాం. బ్రాహ్మణులకు రాజకీయంగా కూడా సహకరిస్తాం. బీజేపీ కి ఒకసారి అవకాశం ఇవ్వండి. మీరు క్షేమంగా ఉంటేనే… మేము సంతోషంగా ఉంటాం.

Leave a Reply