Suryaa.co.in

Andhra Pradesh

ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ .. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్

-టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా? జగన్ ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా?
-రేయ్… ధర్మా… విశాఖ శారదా పీఠానికి భూమి ఇచ్చేస్తావా? ఎవరబ్బ సొమ్ము?
-ధర్మారెడ్డిపై ఢిల్లీలో క్రిమినల్ కేసులు
-దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి ధర్మారెడ్డి
-అటువంటి వెధవలతో గోవిందుడి ఆలయం నడిపిస్తారా?
-పొన్నవోలుగా.. మేము‌ నరికే బ్యాచ్ కాదురా… నరకం చూపే బ్యాచ్
-కర్రపట్టుకున్న వారిని కాల్చిపారేయాలి
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి

నెల్లూరు: టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి ధర్మారెడ్డి. అటువంటి వెధవలతో గోవిందుడి ఆలయం నడిపిస్తారా? అని ఆనం మండి పడ్డారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధర్మారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే… టీటీడీ దేవస్థానాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చిన వారందరిపై విచారణ జరుగుతుంది. స్వామి సొమ్ము తిన్న ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి రాబోయే రోజుల్లో నరకం చూడక తప్పదు. ‘‘రమణదీక్షితులు పింక్ డైమండ్‌ని దొంగలెత్తుకెళ్లారని చెప్పాడు. పొట్టోడు విజయసాయి.. పింక్ డైమండ్ చంద్రబాబు బెడ్ రూంలో ఉందన్నాడు. ధర్మారెడ్డి… ఆ కోర్టు కేసు ఏమైంది? టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా? జగన్ ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా?

స్వామి వారి డబ్బు రూ.2కోట్లు కట్టి కేసు వేస్తే.. నీరుగారుస్తావా? శ్రీవాణి ట్రస్టుకి సంబంధిచిన రూ.2వేల కోట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎలా పెడతావ్? గోవిందుడికి పంగనామాలు పెట్టారు. ధర్మారెడ్డి కటాకటాల వెనక్కి పోవడం ఖాయం. ఢిల్లీకే కాదు, లండన్ కి వెళ్లినా విడిచిపెట్టం. చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి 6 నెలల్లో 4 బోర్టు మీటింగులు పెట్టాడు. ముందు బోర్డు మీటింగ్‌లు లైవ్ పెట్టేవారు. ఈ నాలుగు బోర్డు మీటింగులు ఎందుకు లైవ్ ఇవ్వలేదు. అజెండాలు బయటకి రానివ్వలేదు. రూ.వేల కోట్ల పనుల్లో‌ 4 శాతం వాటాల కోసమే బోర్డు మీటింగులు పెట్టారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.100కోట్ల దర్శన టిక్కెట్లు అమ్ముకున్నారు. ఒక్క ప్రోటోకాల్ టిక్కెట్టు రూ.లక్ష చొప్పున అమ్ముకున్నారు. రేయ్… ధర్మా… విశాఖ శారదా పీఠానికి భూమి ఇచ్చేస్తావా? ఎవరబ్బ సొమ్ము? టీటీడీ మొత్తం అవినీతిమయం. స్వామి వారి హుండీ… వైసీపీ పార్టీ, జగన్ హుండీగా మారిపోయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే.. ఎమ్మెల్యేల లెటర్లు, ప్రోటోకాల్ దర్శనాలు ఎలా ఇస్తారు?

నాలుగు రోజులు నుంచి మళ్లీ దండకాలు మొదలెట్టారు. వైఎస్ మొట్టమొదటి సారి నాన్ ఐఏఎస్ అధికారిని పెట్టాడు. జగన్ మళ్లీ నాన్ ఐఏఎస్ ని నియమించాడు. హుండీ కొల్లగొట్టేందుకే… నాన్ ఐఏఎస్‌లని‌ పెట్టారు. ఐఏఎస్‌లు ఎందుకు మౌనంగా ఉన్నారు.. జగన్‌ని చూస్తే భయమా? మీరు ప్రశ్నించి ఉంటే, టీటీడీలో ఈ పరిస్థితి ఉండేది కాదు.

డైరెక్ట్‌గా కర్రలు తీసుకుని తిరగబడమని సజ్జల చెప్పాడు. ఎన్నికల అధికారులు కౌంటింగ్ హాలులో పారా మిలటరీ‌ సిబ్బందిని నియమించాలి. కర్రపట్టుకున్న వారిని కాల్చిపారేయాలి. పొన్నవోలుగా.. మేము‌ నరికే బ్యాచ్ కాదురా… నరకం చూపే బ్యాచ్… తాగితే ఒళ్లు తెలియదారా… సారా తాగేవాడికి స్కాచ్ దొరికితే… లపాలపా తాగేయడమేనటరా?’’ అని ఆనం వెంకటరమణారెడ్డి మండి పడ్డారు. ఎన్నికల ఫలితాల్లో టీడీపీవిజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు.

LEAVE A RESPONSE