Suryaa.co.in

Telangana

దామోదర్ రాజనర్సింహతో దీపా దాస్ మున్షీ భేటీ

సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ తో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ సంగారెడ్డి లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కర్ గెలుపు కోసం అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం పై చర్చించారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని చాటేలా నాయకులందరూ సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

LEAVE A RESPONSE