Suryaa.co.in

Andhra Pradesh

వధూవరులకు బంగారు తాళిబొట్టు,పట్టువస్త్రాలు,మెట్టెల కానుక ప్రారంభం

– టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా కానుకల అందజేత
తిరుపతి 13 సెప్టెంబర్ 20 21: చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వివాహం చేసుకునే జంటలకు ఉచితంగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు, తిరుమల శ్రీవారి ప్రసాదాలు కానుకగా అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సోమవారం మధ్యాహ్నం తుమ్మలగుంటలో లాంఛనంగా ప్రారంభించారు. వివాహం చేసుకోబోతున్న 7 జంటలకు ఆయన ఈ కానుకలు అందించి ఆశీర్వదించారు.


ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, చంద్రగిరి శాసనసభ్యులు, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నియోజక వర్గానికి చెందినవారు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఈ కానుక అందించే కార్యక్రమం శాశ్వతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 12 ఏళ్లుగా తుమ్మల గుంటలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకునే జంటలకు ఈ కానుకలు ఇసున్నారని ఆయన చెప్పారు. ఇకపై చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వధువు లేదా వరుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఈ కానుక లన్నీ అందజేసే కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైందని సుబ్బా రెడ్డి చెప్పారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.

శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, 12 ఏళ్ల క్రితం దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా తుమ్మలగుంట లో వివాహం చేసుకునే జంటలకు బంగారు తాళిబొట్టు, మెట్టెలు, పట్టుబట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇకపై నియోజకవర్గానికి చెందిన వారు ఎక్కడ వివాహం చేసుకున్న ఈ కానుకలు అందజేస్తామని తెలిపారు. అంతకుముందు వై వి సుబ్బారెడ్డి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు ఆలయ అర్చకులు చైర్మన్ కు ఘనంగా స్వాగతం పలికారు.
త్వరలోనే సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపు :
టిటిడి చైర్మన్ పేదలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో నాలుగు రోజుల క్రితం నుంచి రోజుకు 2 వేల సర్వ దర్శనం టోకెన్లు జారీ ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారు.
కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చామన్నారు. టోకెన్లు పొందడానికి కౌంటర్ల వద్దకు వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు త్వరలోనే సర్వ దర్శనం టికెట్ల సంఖ్య మరింత పెంచేందుకు అధికారులతో చర్చించామన్నారు.
49 మందికి షోకాజ్ నోటీసులు
తిరుమ‌ల‌: టీటీడీ ఈవో జ‌వ‌హార్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం. హౌస్ బిల్డింగ్ లోన్ లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ 49 మందికి షోకాజ్ నోటీసులు. టీటీడీ చ‌రిత్ర‌లో తొలిసారిగా 49 మంది ఉద్యోగుల‌కు నోటీసులు.

LEAVE A RESPONSE