Suryaa.co.in

Telangana

యాదగిరిగుట్ట నీ సొంత ఆస్తి కాదు

-ముఖ్యమంత్రిపై మండిపడ్డ డీకే అరుణ

యాదగిరిగుట్ట నీ సొంత ఆస్తి కాదని, ముఖ్యమంత్రి కెసిఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. సోమవారం గోవా లో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజ్జరైన డీకే అరుణ. యాదగిరిగుట్ట ప్రారంభోత్సవంలో జరిగిన విషయాల పై స్పందిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేసారు. ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా పేరు మార్చి ప్రజల మనోభావాలు దెబ్బ తీసాడని డీకే అరుణ ఆరోపించారు.

తన సొంత భూమిలో ఆలయ నిర్మాణం చేసినట్టు, సొంత పార్టీ నాయకులను ఆలయ శంకుస్థాపనకు పిల్చుకునాడని, మరి రాష్ట్ర మొదటి పౌరురాలైన తమిళ సైను ఆలయ ప్రారంభోత్సవానికి అహ్వానించక పోవడం ముఖ్యమంత్రి దురహంకారానికి నిదర్శనమని డీకే అరుణ విమర్శించారు. మహిళలను గౌరవించలేని కెసిఆర్ కు ముఖ్యమంత్రి కుర్చీ లో కూర్చునే అర్హత లేదని డీకే అరుణ అన్నారు. ఎంతో పురాతనమైన ఆలయ పేరు యాదగిరిగుట్టగానే పిలవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన దాన ధర్మాల వల్ల ఆలయ నిర్మాణం జరిగిందే తప్ప , తన జేబులో నుంచి ఖర్చు పెట్టలేదు అని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని డీకే అరుణ అన్నారు.

LEAVE A RESPONSE