పశ్చాత్తాపం లేకపోగా.. పండుగ చేసుకుంటారా..?: మంత్రి కొడాలి నాని ఫైర్

– ఎన్టీఆర్ కు ద్రోహం చేసినందుకు, ఆయన విగ్రహం కాళ్ళు పట్టుకునైనా బాబు క్షమాపణ కోరాలి
– ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అయితే.. ఎందుకు వెన్నుపోటు పొడిచారు, ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు?
– ఎన్టీఆర్ పదవి లాక్కుని, ఆయన చావుకు కారణమైంది “420 వెన్నుపోటు బ్యాచ్” నీచులే కదా..
– నాడు ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించి.. నేడు దండలు వేయడానికి సిగ్గు లేదా..?
– ఎన్టీఆర్ చావుకు కారణమై.. ఆయన పేరుతో టీడీపీ పండగా..!?
-మంత్రి కొడాలి నాని
– రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. పునర్నిర్మాణం చేస్తావా బాబూ..!?
– ఎన్టీఆర్ శాపం తగిలే.. చంద్రబాబు కొడుకు లోకేష్ కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కూడా ఓడిపోయాడు
– టీడీపీకి చంద్రబాబు, లోకేష్ లు దరిద్రంలా పట్టారు.. ఎన్టీఆర్ అభిమానులు వారిద్దర్నీ రాజకీయంగా సమాధి చేస్తారు
– బాబు బొమ్మ పెడితే ఓట్లు రాలటం లేదనే.. మళ్ళీ ఎన్టీఆర్ భజన చేస్తున్నారు
– ఇప్పుడున్నది ఎవరి పార్టీ – ఆ టీడీపీకి, ఈ టీడీపీకి సంబంధం ఏమిటో బాబు సమాధానం చెప్పాలి
– మీడియా ముసుగెందుకు.. దమ్ముంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 యాజమాన్యాలు బాబు బొమ్మ పెట్టుకోండి
– వైఎస్ఆర్ గారి బొమ్మతో ఉన్న సాక్షి ఆ కుటుంబ సభ్యులదేనని దమ్మూ, ధైర్యంగా చెబుతున్నాం

– మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
అదే 420 వెన్నుపోటు బ్యాచ్..
రాష్ట్ర ప్రజల చేత అన్న అనిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన పార్టీ స్థాపించి 40 ఏళ్లు అయ్యాయని, ఇవాళ ఎన్టీఆర్‌ బొమ్మలు, ఫోటోలు పెట్టుకుని మరోసారి ప్రజలను మోసం చేయాలని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన 420 వెన్నుపోటు బ్యాచ్ ఈరోజు హడావుడి చేస్తుంది. నాడు ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించి, ఆయన పార్టీని లాక్కుని, ఆయన్ను పార్టీలో నుంచి సస్పెండ్‌ చేసి, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని లాక్కుని, ఆయన చావుకు కారణం అయిన దుర్మార్గులు చంద్రబాబు నాయుడు, ఈనాడు అధినేత, ఆంధ్రజ్యోతి అధినేత. ఈ ద్రోహులు, ఈ 420 వెన్నుపోటు బ్యాచ్‌… రెండు మూడు రోజుల నుంచి ఎన్టీఆర్‌ ఫోటోలు, విగ్రహాలు, ఎన్టీఆర్‌ భజన కార్యక్రమాలను చూపిస్తూ పండగ చేస్తున్నారు.

– వాస్తవానికి, వీళ్లకు ఎన్టీఆర్‌ మీద ఎలాంటి ప్రేమ లేదు. ఆయన పెట్టిన పార్టీ మీద, ఆయన ముఖ్యమంత్రి కుర్చీ పైనే వీరి ప్రేమ అంతా. వాటిని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని మింగేయవచ్చనే ఆలోచనతో నాడు వ్యవహారాలు నడిపారు. చంద్రబాబు నాయుడు డిఫాల్టర్‌ నాయకుడు అయిపోయాడు, బాబు బొమ్మ పెట్టినా, బాబు పేరు పెట్టినా ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిలో ఉన్నారని, టీడీపీకి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌ దరిద్రంలాగా పట్టి పీడిస్తున్నారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే భావిస్తున్నారు. వీళ్ల పేర్లు చెబితే నాలుగు ఓట్లు కూడా రావు. మళ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెత్త చెత్తగా ఓడిపోతుంది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం, మళ్లీ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మోసం చేయాలనే ఈ డ్రామాలు ఆడుతున్నారు. అందుకే, ఎన్టీఆర్ చావుకు కారణం అయిన ఈ గుంటనక్కలు మళ్లీ ఎన్టీఆర్‌ బొమ్మలు, ఫోటోలతో భజన చేసే కార్యక్రమాలు పెట్టుకున్నారు.

ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఎందుకు ఆయన్ను సస్పెండ్ చేశారు
రాష్ట్ర ప్రజలు, ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ 420 వెన్నుపోటు బ్యాచ్ సమాధానం చెప్పాల్సిందేంటంటే.. “ఎన్టీఆర్‌ మీద ప్రేమ, అభిమానాలు ఉంటే ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ను పార్టీలోనుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారు. ఆయన సీఎం స్థానాన్ని ఎందుకు లాక్కున్నారు. ఆయన చావుకు ఎందుకు కారణం అయ్యారు. మీరు చేసింది తప్పా కాదా? ఎన్టీఆర్‌ గొప్ప వ్యక్తి అయితే.. మిమ్మల్ని ఏమనాలి? మీరు 420 వెన్నుపోటు గాళ్లే కదా? మీరు నీచులే కదా? పదవి కోసం ఆరోజు ఎంగిలి మెతుకులకు ఆశపడిన కుక్కల్లా ఎన్టీఆర్‌ పంచన చేరి, ఆయనను మోసం చేసిన నిష్టదరిద్రులే కదా? ఆయన గొప్పవాడు అయితే మీరు ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన ద్రోహులేగా?”

– ఒకవేళ మీరు గొప్పవాళ్లు అయితే.. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలను పీడించినవాళ్లు అవుతారు కదా?. అందుకు కాబట్టే కదా మీరు ఆయన్ని అధికారంలో నుంచి దించింది? ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత సిగ్గులేకుండా తాము ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారనే పిచ్చి భ్రమల్లో ఉంటూ చంద్రబాబు అండ్‌ కో బతుకుతున్నారు.

మీ ముగ్గురూ ఎన్టీఆర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరండి
ఎన్టీఆర్‌ మంచి వ్యక్తి, ఆయన ప్రజల కోసం జీవితాన్ని ధారపోశారని మీరు భావిస్తే.. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ ముగ్గురు కలిసి ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గరకు వెళ్ళి, ఆయన కాళ్లు పట్టుకుని, చేసిన తప్పులకు చెంపలేసుకుని, రెండు కన్నీటి బొట్లు కార్చి, తప్పు అయిపోయింది క్షమించన్నా అని ప్రాయశ్చితం కోరుకోవాలి. లేకుంటే మీరు ఎన్టీఆర్‌ పేరు చెప్పడానికి, ఆయన విగ్రహం పెట్టడానికి, కూడా నైతిక హక్కు లేదు. మీరే చంపుతారు, మీరే పదవులు లాక్కుంటారు. మీరే పార్టీని లాక్కుని పైపెచ్చు ఎన్టీఆర్‌ విగ్రహానికి మళ్ళీ మీరే పూలమాలలు వేసి ఆయన గొప్పవ్యక్తి.. అంటూ గుణగుణాల గురించి మాట్లాడం చూస్తుంటే మీలాంటి పనికిమాలిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరన్నది చిన్నపిల్లాడికి కూడా తెలిసిన విషయమే.

బాబు వెన్నుపోటుకు 27 ఏళ్ళు
చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి దాదాపు 27 ఏళ్లు గడిచాయి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, ఏదైనా ఒక గొప్ప పథకం ప్రవేశపెట్టావని, ప్రజలు గుర్తుచేసుకునే పరిస్థితి ఉందా? ఎన్టీఆర్‌గారికి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్నావ్‌. మీ నాయకత్వంలో, ఇప్పటికే తెలంగాణలో మీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇక ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరక్క పారిపోయావు. కనీసం 10శాతంసీట్లు కూడా గెలవలేని దుస్థితికి టీడీపీని తీసుకువచ్చిన ఘనుడు చంద్రబాబు కాదా? మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్‌ సీట్లుకు తీసుకువచ్చావు. ఒక రాజ్యసభ సభ్యుడిని గానీ, శాసన మండలి సభ్యుడిని గానీ గెలిపించుకోలేని పరిస్థితికి టీడీపీని దిగజార్చావు. తెలుగుదేశం పార్టీని ఇంతగా దిగజార్చినందుకు మీ గొప్ప గుణగణాల గురించి, మీ నాయకత్వ పటిమ గురించి రాష్ట్ర ప్రజలు చర్చించుకోవాలా?

ఎన్టీఆర్ శాపం వల్లే…
ఎన్టీఆర్‌ గారికి చేసిన ద్రోహానికి మీ దుష్టద్వయానికి ఆయన శాపం పక్కాగా తగులుతుంది. అందుకే మీ కొడుకు లోకేష్ మంగళగిరిలో శాసన సభ్యుడిగా గెలువకుండా చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఎన్టీఆర్‌ శాపం కాదా? ఎన్టీఆర్‌ను అభిమానించేవాళ్లు, ఆయన కోసం సర్వస్వం ధారపోసే వ్యక్తులు మిమ్మల్ని తిరస్కరించబట్టే, కేవలం 23 సీట్లకు పరిమితమై ప్రతిపక్షంలో కూర్చున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు శని పోవాలని ఎన్టీఆర్‌ ఫోటోలు పెట్టుకుంటుంది దేనికోసం? టీడీపీ అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్‌ ఫోటోలు వాడుకోవాలి, మళ్ళీ అధికారంలోకి వచ్చి మీరు, మీ కొడుకు, మీ 420 బ్యాచ్‌ కలిసి రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతినాలి అన్నదే మీ సిద్ధాంతం కాదా…?

– ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల్ని, మనవళ్లు, మనమరాళ్లను రోడ్డుపాలు చేసి, రాజకీయంగా అనాధల్ని చేసిన చంద్రబాబుకు, మళ్ళీ ఆయన పేరు చెప్పుకోవటానికి ఎక్కడ సిగ్గు లేదు..? అధికారం మీరు అనుభవించి, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల్ని అనాధల్ని చేయాలనే ఆలోచన మీది కాదా?. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్‌ అభిమానులు ఓటు వేస్తే… ఆ ఓటు ద్వారా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల్ని సర్వనాశనం చేసి మీరు, మీ కొడుకు మళ్ళీ వేల కోట్లు సంపాదించి, అధికారాన్ని చెలాయించుకోవడానికి తప్పించి మీరెందుకు పనికివస్తారు.? ఇంత ద్రోహం చేసిన మీకు రాష్ట్ర ప్రజలు ఎందుకు అధికారాన్ని అప్పచెబుతారు? ఎన్టీఆర్‌ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును ఆయన కొడుకుని రాజకీయ సమాధి చేసి పగ, ప్రతీకారం తీర్చుకుంటారు. మిమ్మల్ని సర్వనాశనం అయ్యేవరకూ ఎన్టీఆర్‌ అభిమానులు వదిలిపెట్టారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. పునర్నిర్మిస్తావా బాబూ?
73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు లేవలేడు, కూర్చోలేడు. ఆయన రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించి, తెలుగుదేశం పార్టీని పరిగెత్తిస్తాడట? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయకత్వం ఉండబట్టే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడింది. ఓటుకు కోట్లు కేసులో దొంగలాగా పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావు. దాని ద్వారా ​కేంద్రం, పక్క రాష్ట్రాలు మిమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేసి, బెదిరించి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని కూడా వాళ్లకు అనుకూలంగా వదిలేసిన పరిస్థితి తెచ్చింది మీరు కాదా..?

బాబు వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి
జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సారథ్యంలో బడుగు, బలహీన, పేద, మైనార్టీ వర్గాలకు బ్రహ్మాండంగా పరిపాలన అందుతోంది. అదేవిధంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రిగారు ధృడ నిర్ణయంతో ఉన్నారు. రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెట్టి, మీకు సంబంధించిన వాళ్లను మరింత బాగా బలవంతుల్ని చేసి, మిగిలినవారికి అన్యాయం చేయాలనే ఆలోచన మా ముఖ్యమంత్రిగారికి లేదు. మీలాంటి నిష్ట దరిద్రులు అధికారంలో ఉండేబట్టే… ఈ రాష్ట్రం రెండు ముక్కలు అయింది. మీలాంటి దరిద్రుల్ని 2014 ఎన్నికల్లో ఎన్నుకోబట్టే ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి… కేంద్రానికి, పక్కనున్న రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ను అప్పచెప్పి సొల్లు కబుర్లు చెప్పి తిరిగావు కాబట్టే రాష్ట్రానికి ఈ దుస్థితికి వచ్చింది.

– కాబట్టి చంద్రబాబు నాయుడు, సీపీఐ నారాయణ, రామకృష్ణ, పవన్‌ కల్యాణ్‌తో, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లోకి చంద్రబాబు పంపించిన కోవర్టులతో గంటలు గంటలు సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే.. మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేదు.

దమ్ముంటే చంద్రబాబు బొమ్మ పెట్టుకోండి
చంద్రబాబు బినామీలు, ఈ 420 బ్యాచ్… మీకు ఛానల్స్‌ లేవా? సాక్షి మీకు లేదా? అని అంటున్నారు. అవును సాక్షి మా ముఖ్యమంత్రిగారిదే. సాక్షి పేపర్‌లో గానీ, టీవీలో కానీ వైయస్సార్‌గారి బొమ్మ పెట్టాం. సాక్షి మాది కాదని మేము చెప్పలేదు. సాక్షి జగన్‌గారి కుటుంబసభ్యులదే. సాక్షి పేపర్‌, టీవీ ఛానల్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవే. మాకు సంబంధించివే అని రాజశేఖర్‌ రెడ్డిగారి ఫోటో పెట్టుకుని దమ్ముగా ముందుకు వెళుతున్నాం. అంతేగానీ, మీ మాదిరిగా, మీడియా ముసుగులో, చంద్రబాబు ముసుగులో, ఆయన బినామీలు నడుపుతూ, పైపెచ్చు ఆ మీడియా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.

– మా మాదిరిగా, మీకు దమ్మూ, ధైర్యం ఉంటే…. చంద్రబాబు బినామీలమే అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకోవాలి. ఆయన విసిరే ఎంగిలి మెతుకులతో టీవీలు, పేపర్లు నడుపుకుంటున్నామని, మా దైవం చంద్రబాబే అని ఆయన డప్పే కొడతాం, చంద్రబాబు తెలుగుదేశం కోసమే పని చేస్తామని దమ్ముంటే చెప్పండి. మీకెందుకు దొంగ బతుకు ? మీ పేపర్లు, టీవీలు నడిచేది చంద్రబాబు డబ్బుతో. దమ్ముంటే సీబీఎన్‌ ఫోటో పెట్టండి. మీకు దమ్ము లేదు, డైరెక్ట్‌గా ఫైట్‌ చేయలేరు. మీదంతా బాబు మాదిరిగా వెన్నుపోటే. అందుకే ఎన్టీఆర్‌ గారిని పొడిచి పొడిచి చంపారు. ఇవాళ ఎన్టీఆర్‌ పేరుమీద పండుగ చేసుకుంటూ మీరంతా కలిసి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికైనా మీ మీడియా ముసుగు తీయండి.

– వైఎస్‌ రాజారెడ్డిగారి రక్తం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిలో ఉంది కాబట్టే జగన్‌గారు దమ్ము, ధైర్యంగా గుండెలు చీల్చి మాట్లాడే వ్యక్తి. ఖర్జూరనాయుడు, చంద్రబాబు నాయుడు అంతా 420 బ్యాచ్‌, మీది 420 బ్లడ్‌. అందుకే, ముసుగువీరుల్లా, వెనుక నుండి కుట్రలు చేస్తున్న వెన్నుపోటు వ్యక్తులు. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. వెక్కి వెక్కి ఏడవటం తప్ప చంద్రబాబు ఎందుకు పనికిరాని వాడు అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ విషయం ఈ డబ్బా మీడియాకు, టీడీపీకి అర్థమయ్యింది కాబట్టే, మళ్లీ ఇవాళ ఎన్టీఆర్‌ బొమ్మలు పెట్టుకుని రాష్ట్ర ప్రజల ద్వారా అధికారంలోకి రావాలని దొంగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
చంద్రబాబు నాయుడు ఏమైనా ఎన్టీఆర్‌గారి కొడుకా? ఆయన రక్తం చంద్రబాబులో ప్రవహిస్తుందా? ఎన్టీఆర్‌ బతికుండగా, వీళ్లు చెప్పినట్లు ఆయన మంచి వ్యక్తి అయితే.. ప్రజల కోసమే పనిచేస్తే పార్టీ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లే అవసరం ఏముంటుంది?. పార్టీని లాక్కుని, ముఖ్యమంత్రి పదవిని దొంగతనం చేసి, ఆ సీట్లులో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళంతా కుమ్మక్కై, ఎన్టీఆర్‌కు ఎందుకు ద్రోహం చేశారు? వెన్నుపోటు ఎందుకు పొడిచారు? ఆయన సరైనవాడు కాదనే కదా? ఇవాళ చంద్రబాబు పనికిరాడని తెలిసిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్‌ కావాల్సి వచ్చారా? ఆయన పేరును వాడుకుని ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలన్నదే చంద్రబాబు ప్రయత్నం. ఈ విషయం ఎన్టీఆర్‌ నిజమైన అభిమానులకు తెలుసు. అందుకే ఎన్టీఆర్‌ అభిమానులు టీడీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వరు.

– జగన్‌గారి వద్ద మార్కుల కోసమో, పదవుల కోసం మాట్లాడే వ్యక్తిని కాదు. నేను బతికినంత కాలం జగన్‌గారితోనే ఉంటాను. నాకు ఏ మార్కులు అవసరం లేదు. నాకు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవితో కూడా సంబంధం లేదు. మంత్రి పదవి ఉండబట్టే, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, బాధ్యతగా ఉండాల్సి వస్తుంది, అది లేకపోతే నా విశ్వరూపం ఏమిటో టీడీపీ వాళ్ళు చూస్తారు. నేను ఏ పదవినీ ఆశించి వైయస్సార్‌ సీపీలోకి రాలేదు.

Leave a Reply