– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నక్సలైట్లను ఎందుకు చర్చలకు పిలవలేదు?
– కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీకి మద్రాసు సాక్షిగా చీకటి ఒప్పందం
– కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు, తిప్పిపోతల ప్రాజెక్టు
– బీఆర్ఎస్, కాంగ్రెస్ గాడిదకు గడ్డేసి దున్నపోతుకు పాలు పిండినట్లుగా పనిచేస్తున్నాయి
– కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ, కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విధ్వంసానికి కారణమైన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. ప్రాజెక్టులు కడుతున్నామని, లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లారు.
కేసీఆర్ ఫాంహౌస్ నుండి జిల్లా, నియోజకవర్గాల వారీగా 10 లక్షల మందితో సభ నిర్వహించాలంటూ ప్రకటించి, రూ.150 కోట్లు ఖర్చు చేసినా, లక్ష మందిని కూడా సమీకరించలేకపోయారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పూర్తిగా విఫలమైంది. తెలంగాణ ప్రజలు ఇకపై కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితిలో లేరు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు తెలంగాణకు కేటాయించినప్పటికీ, బీఆర్ఎస్ మాత్రం అసత్య ప్రచారం చేస్తోంది.
బీజేపీని విమర్శించడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు చేసినట్లుగా ఉంది. తెలంగాణలో ఎయిమ్స్, రైల్వే మార్గాలు, కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ రహదారి ప్రాజెక్టులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది నిధులు ఖర్చుచేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గాడిదకు గడ్డేసి, దున్నపోతుకు పాలు పిండినట్లుగా పనిచేస్తున్నాయి.
కేసీఆర్ .. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు చేసే హింను వెనకేసుకొస్తున్నారు. నక్సలైట్లను చర్చకు పిలవాలని చెబుతున్నారు. మరి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందుకు చర్చలకు పిలవలేదు? పదేళ్లలో అనేక ఎన్ కౌంటర్లు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత మావోయిస్టులు గుర్తొచ్చారా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ భాగస్వామి గా ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టులపై కేసీఆర్, బిఆర్ఎస్ నాయకులు చేసే వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజావ్యతిరేక విధానాలు, ఆర్థిక నేరాలు ప్రజలు మరచిపోలేరు. ప్రజలు బీఆర్ఎస్ను అసహ్యించుకుంటున్నారు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంసం, దోపిడీ, అవినీతి, అప్రజాస్వామికం, అరాచకం, నియంతృత్వం, కుటుంబ పాలన మాత్రమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.70 వేల కోట్లు ఉంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.8 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పు పెరిగింది. లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా అదనపు నీరు ఇవ్వలేకపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు, తిప్పిపోతల ప్రాజెక్టు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు, డిజైన్ లోపాన్నాయని తేల్చింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, గుత్తేదారుల జేబులు నింపారు. ధరణి పోర్టల్ ద్వారా లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దేవాదాయ, ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతమయ్యాయి.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజలకు పీడగా మిగిలింది, ప్రజలు మళ్లీ అలాంటి పాలనను కోరుకోరు. గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించామని ఓట్లు గడించిన బీఆర్ఎస్, ఇప్పుడు మార్పు తెస్తామని ఓట్లు గడిచిన కాంగ్రెస్ రెండూ ప్రజలను మోసం చేశాయి. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు, అందుకే కాంగ్రెస్-బీఆర్ఎస్ కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయి.
చెన్నైలో జరిగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ప్రజలకు బహిర్గతమైంది. నక్సలైట్లపై చర్చల పేరుతో కేసీఆర్ చేసే మాటలు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చే మతిస్థిమితం కోల్పోయిన వ్యాఖ్యలే. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ప్రశాంతంగా సీఎం గా కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటుండటం, కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య గాఢమైన చీకటి సూచిస్తోంది.
ఇటీవల చెన్నైలో జరిగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం కూడా ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా ఉండాలని పదేపదే కోరుకుంటున్నారంటే.. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్నట్లుగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మద్రాసు సాక్షిగా చీకటి ఒప్పందం జరిగింది.
కాంగ్రెస్ పార్టీకి తోకపార్టీగా మారి, సూడో సెక్యులరిస్టుగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నది. గ్రాడ్యుయేట్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల కాంగ్రెస్-ఎంఐఎం మధ్య కుట్ర స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న 11 శాతం వడ్డీకి అప్పు వెనుక భారీ అవినీతి ఉందని, రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి దాని పై విచారణ జరపకపోవడం అనుమానాస్పదంగా ఉంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కలిసి బీజేపీని అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.