– 26 మంది మహిళల సిందూరాన్ని తుడిచేసిన నాడు ఇలాంటి అర్బన్ నక్సల్స్ ఎందుకు స్పందించలేదు?
– బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: యావత్ భారతావని ఆపరేషన్ సిందూర్ ను అభినందిస్తుంటే రాష్ట్రంలోని కొందరు అర్బన్ నక్సలైట్లు దేశద్రోహ భావజాలాన్ని బయటపెట్టుకుంటున్నారు .
ఆపరేషన్ సిందూర్ ను విద్యాకమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి ఎగతాళి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమెపై చర్య తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుందని భావించాల్సి వస్తుంది.
టెర్రరిస్టుల ఇంట్లో దూరి కాల్చి చంపుతున్న ఆపరేషన్ సిందూర్ ను ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతున్నాడు. 26 మంది మహిళల సిందూరాన్ని తుడిచేసిన నాడు ఇలాంటి అర్బన్ నక్సల్స్ ఎందుకు స్పందించలేదు? ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు, వాళ్లకు మద్దతు తెలిపే అక్కడి ప్రభుత్వం గజగజ వణికిపోతుంది. ఇది చాలదా.. సగటు భారతీయుడు గర్వంగా తలెత్తుకోవడానికి?
పహల్గాం ఉగ్రదాడి ప్రతిగా ఆ టెర్రరిస్టుల అడ్డాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ కు యావత్ ప్రపంచం అభినందిస్తుంటే రాష్ట్రంలోని కొందరు అర్బన్ నక్సలైట్లు వాళ్ల దేశద్రోహ బుద్ధిని బయటపెట్టుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. విద్యాకమిషన్ సభ్యురాలైన సుజాత చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుందా? లేక ఖండిస్తుందా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.
ఒకవేళ ఆమె వ్యాఖ్యలను దేశద్రోహంగా భావిస్తే వెంటనే సుజాతను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సరిహద్దులో కొందరు టెర్రరిస్టులు మనపై దాడి చేస్తుంటే, అంతకంటే ఎక్కువ మంది దేశం లోపలే ఉండి, దేశాన్ని బలహీనపరుస్తున్నారని దుయ్యబట్టారు. టెర్రరిస్టులను కాల్చి చంపినట్టుగానే, ఒక్కొక్క దేశద్రోహిని కూడా అదే స్థాయిలో చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అర్బన్ నక్సలైట్లను పెంచిపోషిస్తుంది. ఇప్పటికైనా దేశ ప్రజల వైపు నిలబడాలంటే అలాంటి వాళ్లను దూరం పెట్టాలని లేకుంటే దేశ ప్రజలే కాంగ్రెస్ ను బొంద పెడుతారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వాళ్లకు టెర్రరిస్టులు చేసిన అన్యాయానికి భారత సైన్యం తగిన జవాబు చెప్పినట్టుగా వారు భావిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమయంలో భారత సైన్యం చేపట్టే ప్రతి చర్యకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఇప్పుడు కూడా ఎవరైనా భారత సైనికులు ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడినా, వ్యవహరించినా, వాళ్లను ప్రజలు బట్టలూడగొట్టి తరిమికొడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజాసింగ్ హెచ్చరించారు.